Cancer Cure Claim Punjab: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ భార్యను రూ.850 కోట్లు కట్టాలంటూ నోటీసులు జారీ చేసింది ఛత్తీస్గఢ్ సివిల్ సొసైటీ. స్టేజ్-4 క్యాన్సర్ నుంచి సహజమైన పద్ధతుల్లో తన భార్య కోలుకుందని ఇటీవల సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సొసైటీ నోటీసులు జారీ చేసింది. ఏడు రోజుల్లోపు అందుకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని లేకుంటే కోర్టుకు వెళ్తామని తెలిపింది.
ఇదీ జరిగింది!
చాలా కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న తన భార్య నవజోత్ సింగ్ కౌర్ కోలుకున్నారని ఇటీవల తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్ధూ తెలిపారు. తన భార్య బతకడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారని, అయినా ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకుని, డైట్ ఫాలో అవ్వడం వల్ల క్యాన్సర్ను జయించదని ప్రెస్ మీట్లో పేర్కొన్నారు. అందుకు ఆమె తీసుకున్న డైట్ ప్లాన్ గురించి కూడా షేర్ చేశారు.