తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గవర్నర్​పై లైంగిక వేధింపుల ఆరోపణలు- ముగ్గురు రాజ్​భవన్​ అధికారులపై కేసు - West Bengal Governor Issue - WEST BENGAL GOVERNOR ISSUE

Bengal Governor Molestation Case : బంగాల్ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో రాజ్‌భవన్‌లోని ముగ్గురు అధికారులపై పోలీసు కేసు నమోదైంది. మేజిస్ట్రేట్‌ ముందు బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం తర్వాత అధికారులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

Bengal Governor
Bengal Governor (ANI)

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 3:00 PM IST

Bengal Governor Molestation Case: బంగాల్ గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. రాజ్‌భవన్‌లోని ముగ్గురు అధికారులపై పోలీసు కేసు నమోదైంది. మేజిస్ట్రేట్‌ ముందు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత హరే స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌లో ముగ్గురు అధికారులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్న ముగ్గురు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న ఉద్దేశంతో ఈనెల 2న బాధితురాలు రాజ్‌భవన్‌ నుంచి బయటకు రాకుండా వారు అడ్డుకున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయంపై దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. గవర్నర్‌ సీవీ ఆనందబోస్‌ తనను లైంగిక వేధింపులకు గురించినట్లు రాజ్‌భవన్‌లో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగిని ఆరోపించారు. 361 ఆర్టికల్‌ ప్రకారం పదవిలో ఉన్న గవర్నర్‌పై నేర విచారణ చేపట్టడానికి వీలుండదు.

ఇదీ జరిగింది!
ఇటీవల బంగాల్​ గవర్నర్​ సీవీ ఆనంద్​ బోస్ తనను​ వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. కోల్​కతా రాజ్​భవన్​లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై గవర్నర్​ బోస్​ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ సందర్భాల్లో వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది. ఇక దీనిపై స్పందించేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదు.

ఈ కేసు విషయంలో ఆనంద్​ బోస్ వేధింపుల అంశానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని 100 మంది పౌరులకు చూపించారు. సీసీటీవీ ఫుటేజీని 'రాజకీయ నాయకురాలు మమతా బెనర్జీ', 'ఆమె పోలీసులు'కు తప్ప 100 మందికి చూపిస్తామని ప్రకటించింది. సీసీటీవీ ఫుటేజీని తమకు ఇవ్వడం లేదని పోలీసులు కల్పిత ఆరోపణలు చేశారు. వారిది చట్టవిరుద్ధమైన విచారణ. ఈ నేపథ్యంలో గవర్నర్​ ఆనంద్​ బోస్​ 'సచ్​ కే సామ్​నే' అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ ఫుటేజీని చూపించారు.

రాష్ట్రపతికి లేఖ
గవర్నర్ సీవీ ఆనంద్ బోస్​పై వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ, తనకు న్యాయం చేయాలంటూ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాస్తారని ఇటీవల మీడియాకు తెలిపారు. ఈ విషయంలో కోల్‌కతా పోలీసులపై ఆశలు పెట్టుకోలేకపోతున్నానని, తీవ్ర నిరాశకు లోనవుతున్నానని ఆమె మీడియాకు తెలిపారు. అందుకే రాష్ట్రపతికి లేఖ రాయడమే సరైన మార్గమని భావిస్తున్నట్లు చెప్పారు.

మాలీవాల్ దాడి కేసులో సీఎం PA బిభవ్ కుమార్ అరెస్ట్- వైద్య నివేదికలో కీలక విషయాలు! - Swati Maliwal Assault Case

సిగ్నల్​కు బురద పూసి రైలులో దోపిడీకి యత్నం- ఎదురుతిరిగిన ప్రయాణికులు- దెబ్బకు దుండగులు పరార్! - Train Robbery Uttarakhand

ABOUT THE AUTHOR

...view details