Protest Against BRS Leader PadmaRao in Secunderabad : పద్మారావు గౌడ్కు అడుగడుగునా నిరసన సెగ.. నియోజకవర్గంలో అడుపెట్టనివ్వని ప్రజలు - hyderabad latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-10-2023/640-480-19870325-thumbnail-16x9-protest-against-brs-leader-padmarao-in-secunderabad.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Oct 27, 2023, 2:45 PM IST
Protest Against BRS Leader PadmaRao in Secunderabad : తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు తమ తమ నియోజకవర్గాలలో ప్రచారాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్కు చేదు అనుభవం ఎదురైంది. తార్నాక డివిజన్ మానికేశ్వర్ నగర్లో బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తున్న పద్మారావు గౌడ్కు వ్యతిరేకంగా.. 'గో బ్యాక్ పద్మారావు' అంటూ స్థానికులు నినాదాలు చేశారు. హామీలు నెరవేర్చకుండా పద్మారావు గౌడ్ మానికేశ్వర్నగర్లో అడుగు పెట్టనివ్వమని స్థానికులు నిరసన తెలియజేశారు.
గత 50 సంవత్సరాలుగా మానికేశ్వర్ నగర్లో నివాసం ఉంటున్నా.. ఇక్కడ కనీస ఆసుపత్రి సదుపాయం లేదని స్థానికులు చెబుతున్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికై 160 రోజులు దీక్షలు చేపడితే స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆస్పత్రి నిర్మాణానికి హామీ ఇచ్చి.. దీక్షను విరమింప చేశారని.. కానీ ఆ తర్వాత దాని ఊసే ఎత్తలేదని వాపోయారు. పలుమార్లు పద్మారావును కలిసి ఆసుపత్రి గురించి మాట్లాడటానికి వెళ్తే చులకన చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చిన తర్వాతే మానికేశ్వర్ నగర్లో ఆయణ్ను అడుగుపెట్టనిస్తామని స్పష్టం చేశారు.