కాళేశ్వరం న్యాయవిచారణ ఆపేందుకు బీఆర్ఎస్‌, బీజేపీ ఏకమవుతున్నాయి : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 3:08 PM IST

MLC Jeevan Reddy React on KTR Comments : తెలంగాణ పదాన్ని చెరిపేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేటీఆర్ అనడం ఆశ్చర్యకరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఉద్యమ లక్ష్యాలను నీరుగార్చిందే కేసీఆర్‌ అని ఆరోపించారు. పార్టీ పేరులో తెలంగాణను తొలగించిన వారు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు.

MLC Jeevan Reddy Fire on BRS : కాళేశ్వరం ప్రాజెక్ట్‌(Kaleshwaram Project) విషయంలో న్యాయ విచారణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఏకమవుతున్నాయని జీవన్‌రెడ్డి(MLC Jeevan Reddy) ఆరోపించారు. బీజేపీ నేతల మాటల్లో కేసీఆర్‌ను రక్షించాలనే తాపత్రయం కనిపిస్తోందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణను చూసే బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిలో అధికారుల పాత్ర కూడా ఉందని వ్యాఖ్యనించారు. సీబీఐ విచారణ కన్నా న్యాయ విచారణ గొప్పదని జీవన్‌రెడ్డి తెలిపారు. పారదర్శక విచారణ కోసమే ప్రభుత్వం జ్యుడీషియల్‌ విచారణ జరిపిస్తోందని స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.