ఆత్మస్తుతి పరనింద నుంచి కేటీఆర్ బయటకు రావాలి : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి - MLC Jeevan Reddy about Elections

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 6:27 PM IST

MLC Jeevan Reddy on KTR : మాజీ మంత్రి కేటీఆర్‌ ఓటమిని అంగీకరించే పరిస్థితిలో లేరని, ఆత్మస్తుతి పరనింద నుంచి కేటీఆర్​(KTR) బయటకు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హితవు పలికారు. లేదంటే బీఆర్​ఎస్​కు ప్రతిపక్ష స్థానం కూడా దక్కదని ఆక్షేపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు.

Jeevan Redddy Comments on BRS : అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్​ఎస్​ ప్రచారం తప్ప, పనులు చేయలేదని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చి ఉంటే గెలిచే వాళ్లం అని గులాబీ నేతలు అంటున్నారన్న ఆయన, అభ్యర్థులను కాదు అధినాయకుడినే మార్చాలని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్‌ను ఎస్సీ డెవలప్​మెంట్​ ఫండ్‌గా మార్చి నిధులను పక్కదారి మళ్లించి దళిత బంధును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణమని ఆరోపించిన జీవన్​ రెడ్డి, కమీషన్‌ల కోసమే కాళేశ్వరం బోగస్‌ డిజైన్‌ చేశారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.