మంచిర్యాల జిల్లాలో పోలీసులపై బీఆర్ఎస్ సర్పంచ్ అనుచరుల దాడి - BRS leaders attack on constable
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-11-2023/640-480-20095160-thumbnail-16x9-police-pai-dhadi.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 23, 2023, 4:48 PM IST
BRS Sarpanch Attacked The Police In Mancherial : పోలీసులపై బీఆర్ఎస్ నాయకుల దాడి చేసిన ఘటన మంచిర్యాలజిల్లాలోని కన్నెపెల్లి మండలం వీరాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్ అశోక్ గౌడ్తో పాటు అతని కుమారుడు జిల్లెల మహేశ్ గౌడ్ మరి కొంతమంది కలిసి ఆమెపై దాడి చేశారు. బుధవారం రాత్రి ఆ పార్టీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మహిళను బెదిరించడంతో.. ఆమె డయల్ 100కు కాల్ చేసింది.
Sarpanch Attack On Police : కన్నేపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గొడవ అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఇదే సమయంలో మహేష్ గౌడ్తో పాటు 15 మంది వ్యక్తులు పోలీసులతో దుర్భాషలాడి దాడికి దిగారు. ఈ గొడవను వీడియో చిత్రీకరణ చేస్తున్న కానిస్టేబుళ్లు శ్రీనివాస రావు, తులసిరామ్ ఫోన్లను లాక్కున్నారు. దీనిపై పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు... సర్పంచ్ అశోక్ గౌడ్, మహేష్ గౌడ్తో పాటు మరో 15 మందిపై కేసు నమోదు చేశామని కన్నెపల్లి ఎస్సై నరేశ్ తెలిపారు.