యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో విషాదం చోటు చేసుకుంది. పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి అనే యువకుడు వలిగొండకు చెందిన తన స్వంత బావ సింగి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బోర్ బండి కొని వ్యాపారం నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య వ్యాపారంలో భేదాభిప్రాయాలు రావటం వల్ల వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈరోజు హైద్రాబాద్ నుంచి పహిల్వాన్ పూర్లోని ఇంటికి చేరుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో మహేందర్ రెడ్డి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబంలోని నలుగురికి గాయాలు