యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి చెరువు కట్టకి శుక్రవారం మరమ్మతులు ప్రారంభించారు. ఈ పనులను జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ పరిశీలించారు. సోమవారం సాయంత్రం కట్ట ఓ చోట కుంగిపోవటం వల్ల ప్రమాదం పొంచివుందని భావించిన జిల్లా అధికారులు మరమ్మతులు చేపట్టారు.
చెరువు అలుగు పొసే రెండు చోట్ల గండి పెట్టి చెరువు కట్ట మీద నీటి ఒత్తిడి లేకుండా చేశారు. దీంతో సమీప కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. చెరువు వద్దకు వెళ్లకుండా రహదారికి ఇరువైపుల పోలీసుల పికెట్ ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: ఇది రైతులు, కాంగ్రెస్ పార్టీ విజయం: ఉత్తమ్