ETV Bharat / state

అనుమానం, వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు

భార్యాభర్తలిద్దరి మధ్య అనుమానం గెలిచింది. అక్రమ సంబంధం ఉందంటూ ఒకరినొకరు నిందించుకున్నారు. గొడవ తారాస్థాయికి చేరి.. భార్య వంటగదిలో ఫ్యాన్​కు ఉరేసుకొని చనిపోయింది.

author img

By

Published : Dec 21, 2019, 4:26 PM IST

Updated : Dec 21, 2019, 5:20 PM IST

అనుమానం, వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు
అనుమానం, వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు
అనుమానం గెలిచింది.. భార్య ఉరివేసుకుందా..?
యాదాద్రి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన రాజేశ్వరి (28)కి 2009 సంవత్సరంలో జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్​కు చెందిన వెంకటేశ్​తో వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ బార్లో వెంకటేశ్​ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత మూడేళ్లుగా వెంకటేశ్​ ఇతర మహిళతో.. అలాగే రాజేశ్వరి కూడా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు.

ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ అక్రమ సంబంధం విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వారని.. నిన్న రాత్రి వీరి మధ్య గొడవ తారస్థాయికి చేరిందన్నారు. ఇవాళ ఉదయం భర్త నిద్రలేచి చూసేసరికి భార్య రాజేశ్వరి వంట గదిలో ఫ్యాన్​కు చున్నీతో ఉరేసుకొని కనిపించింది. కిందకి దింపి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలి బంధువులు మాత్రం రాజేశ్వరిని ఆమె భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి: గోడ కూలి బాలుడు మృతి

అనుమానం గెలిచింది.. భార్య ఉరివేసుకుందా..?
యాదాద్రి జిల్లా బొమ్మల రామారం గ్రామానికి చెందిన రాజేశ్వరి (28)కి 2009 సంవత్సరంలో జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్​కు చెందిన వెంకటేశ్​తో వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ బార్లో వెంకటేశ్​ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత మూడేళ్లుగా వెంకటేశ్​ ఇతర మహిళతో.. అలాగే రాజేశ్వరి కూడా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు.

ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ అక్రమ సంబంధం విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వారని.. నిన్న రాత్రి వీరి మధ్య గొడవ తారస్థాయికి చేరిందన్నారు. ఇవాళ ఉదయం భర్త నిద్రలేచి చూసేసరికి భార్య రాజేశ్వరి వంట గదిలో ఫ్యాన్​కు చున్నీతో ఉరేసుకొని కనిపించింది. కిందకి దింపి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతురాలి బంధువులు మాత్రం రాజేశ్వరిని ఆమె భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు.

ఇవీ చూడండి: గోడ కూలి బాలుడు మృతి

Intro:TG_HYD_42_21_WOMEN SUICIDE_AB_TS10011
అనుమానం పెనుభూతమై ఓ గృహిణి ప్రాణం బలి తీసుకుంది. తన పై అనుమానంతో భర్త నిత్యం వేధిస్తున్నాడని మనస్తాపంతో గృహిణి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరి గుట్ట పరిధిలో చోటుచేసుకుంది.. ఆత్మహత్య కాదు భర్తే చంపాడని మృతురాలి బంధువుల ఆరోపణ..

note : మృతురాలి ఫోటో మరియు అతని భర్త ఫోటో డెస్క్ వాట్సాప్ కి పంపాను.



Body:యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన మహేశ్వరి (28) కి 2009 సంవత్సరంలో జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ కు చెందిన వెంకటేష్ తో వివాహం అయింది. వీరికి ఏడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. స్థానికంగా ఉన్న ఓ బార్లో వెంకటేష్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత మూడు సంవత్సరాలుగా వెంకటేష్ ఇతర మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని... గత మూడు నెలల నుండి మహేశ్వరి కూడా ఇతర వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో వెంకటేష్ తన భార్యను నిత్యం వేదించేవాడని.. ప్రతిరోజు భార్యాభర్తలిద్దరూ అక్రమ సంబంధం విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే వారని నిన్న రాత్రి వీరి మధ్య గొడవ తారస్థాయికి చేరడంతో ఈరోజు ఉదయం భర్త నిద్రలేచి చూసేసరికి భార్య మహేశ్వరి వంట గదిలో ఫ్యాన్ కు చున్నీ తో ఉరేసుకొని కనిపించింది. కిందకి దింపి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు...
కాగా మృతురాలి బంధువులు మాత్రం మహేశ్వరిని భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు

బైట్ : గంగారెడ్డి ఇ జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్
బైట్ : స్వప్న మృతురాలి సోదరి


Conclusion:my name : upender, 9000149830
Last Updated : Dec 21, 2019, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.