తెరాస పాలనలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 12వ వార్డులో రూ. 5 లక్షల వ్యయంతో మురుగు కాలువ నిర్మాణ పనులు, గాంధీ నగర్ 7వ వార్డులో డ్రైనేజీ పనులు, పాత బస్టాండ్ వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్ది రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపాలిటీలో ఏవైనా సమస్యలుంటే అధికారులతో చెప్పి పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం ఆరెగూడెంలో గుండెపోటుతో మృతి చెందిన నాగుల నర్సయ్య(51) కుటుంబానికి రైతుబీమా పథకానికి సంబంధించిన రూ. 5 లక్షల చెక్కును అందజేశారు.
ఇదీ చదవండి: కొవిడ్తో తల్లిదండ్రులు.. గుండెపోటుతో కుమారుడు