ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. బాలాలయ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు.
లాక్డౌన్ నేపథ్యంలో భక్తులు లేకుండానే స్వామి వారికి ఏకాంత సేవలో ఈ కార్యక్రమం చేపట్టారు. లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ అర్చకులు తెలిపారు.