ETV Bharat / state

స్కూల్​ను దత్తత తీసుకున్న వలిగొండ పోలీసులు

యాదాద్రి జిల్లా వర్కట్​పల్లి ప్రాథమికోన్నత పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు వలిగొండ పోలీసులు ప్రకటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని చౌటుప్పల్​ ఏసీపీ సత్తయ్య విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Jun 18, 2019, 6:59 PM IST

Updated : Jun 18, 2019, 7:10 PM IST

స్కూల్​ను దత్తత తీసుకున్న వలిగొండ పోలీసులు


యాదాద్రి భువనగిరి జిల్లా వర్కట్​పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలను వలిగొండ పోలీసులు దత్తత తీసుకుంటున్నట్లు చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య ప్రకటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలొనే చదివించాలని బడిబాట కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు పోలీసుల సహకారంతో కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు ప్రతిభావంతులని, వారి బోధన ద్వారా పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తారని ఏసీపీ సత్తయ్య హర్షం వ్యక్తం చేశారు.

స్కూల్​ను దత్తత తీసుకున్న వలిగొండ పోలీసులు

ఇవీ చూడండి: 'టిక్​టాక్'​ చేస్తూ మెడలు విరగ్గొట్టుకొన్న యువకుడు


యాదాద్రి భువనగిరి జిల్లా వర్కట్​పల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలను వలిగొండ పోలీసులు దత్తత తీసుకుంటున్నట్లు చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య ప్రకటించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలొనే చదివించాలని బడిబాట కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు పోలీసుల సహకారంతో కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు ప్రతిభావంతులని, వారి బోధన ద్వారా పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తారని ఏసీపీ సత్తయ్య హర్షం వ్యక్తం చేశారు.

స్కూల్​ను దత్తత తీసుకున్న వలిగొండ పోలీసులు

ఇవీ చూడండి: 'టిక్​టాక్'​ చేస్తూ మెడలు విరగ్గొట్టుకొన్న యువకుడు

Intro:TG_NLG_61_18_SCHOOL_ADOPTION_AB_C14

యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లి లోని ప్రాథమికోన్నత పాఠశాలను వలిగొండ పోలీసుల ఆధ్వర్యంలో దత్తత తీసుకుంటున్నట్లు చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య ప్రకటించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ఏసీపీ సత్తయ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలొనే చదివించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల లో అవసరమైన మౌలిక సదుపాయాలు పోలీసుల సహకారం తో కల్పిస్తామని హామీ ఇచ్చారు. వర్కట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు అవసరమైన డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు ప్రతిభావంతులని, వారి బోధన ద్వారా పిల్లలు అన్ని రంగాల్లో వికాసం చెందుతారని అన్నారు.


Body:ప్రభుత్వపాఠశాలలో చదివిన వారు ప్రస్తుతం అన్ని రంగాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారని, తను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివానని ఏసీపీ సత్తయ్య గుర్తు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయరాజ్ మాట్లాడుతూ గ్రామస్థుల సహకారం తో పాఠశాల లో విద్యార్థుల అడ్మిషన్లు పెరుగుతున్నా యన్నారు. అందరి సహకారంతో ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తామన్నారు. అంతకు మునుపు బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లల , గ్రామస్థులతో కలిసి ఏసీపీ సత్తయ్య ర్యాలీ లో పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ వద్దు ప్రభుత్వ స్కూల్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జయరాజ్, ఉపాధ్యాయులు అనీఫ్ అహమ్మద్ తో పాటు గ్రామస్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

బైట్ : సత్తయ్య (చౌటుప్పల్ ఏసీపీ )


Conclusion:
Last Updated : Jun 18, 2019, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.