ETV Bharat / entertainment

బిగ్​బాస్​​ 8: వెక్కివెక్కి ఏడ్చిన డాక్టర్​ బాబు - అవినాష్​ ఆ మాట అనడంతోనే!

బిగ్​బాస్​ సీజన్​ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‍గా ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ కృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అందుకు గల కారణాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Bigg Boss 8 Gowtham Krishna Emotional
Bigg Boss 8 Gowtham Krishna Emotional (ETV Bharat)

Bigg Boss 8 Gowtham Krishna Emotional: బిగ్‍బాస్ 8వ సీజన్‍లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది కంటెస్టెంట్లు హౌజ్​లోకి వచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్​ కార్డ్స్ ఎంట్రీతో ఆట కాస్త ఇంట్రెస్టింగ్‍గా మారింది. ఈ క్రమంలోనే హౌజ్​మేట్స్​కు ఓ టాస్క్​ ఇవ్వగా.. గత సీజన్‍లో జరిగిన ఓ విషయాన్ని అవినాశ్ గుర్తు చేయడంతో గౌతమ్ ఫీలయ్యారు. ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. ఏంటి ఆ విషయం​? అక్టోబర్ 9వ నాటి ఎపిసోడ్​లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

టాస్క్​ ఇదే: అమ్మాయిలు, అబ్బాయిలను టీమ్‍లుగా విభజించి గేమ్ ఆడించారు బిగ్‍బాస్. అబ్బాయిలకు లీడర్‌గా రోహిణి, అమ్మాయిలకు హెడ్‍గా అవినాశ్ ఉండాలని చెప్పారు. దీంతో బిగ్‍బాస్ కన్‍ఫ్యూజ్ అయినట్టున్నారని, తాను అమ్మాయిని, అవినాశ్ అబ్బాయి అని రోహిణి చెప్పారు. దీంతో తాను సరిగానే చెప్పానని బిగ్‍బాస్ అన్నారు. ఈ క్రమంలోనే నవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించు అనే గేమ్ జరిగింది. నోటితో నీరు నింపుకున్న కంటెస్టెంట్‍ను నవ్విస్తే వారు ఔట్ అని బిగ్‍బాస్ చెప్పారు.

బిగ్‌బాస్ చెప్పిన దాని ప్రకారం ముందుగా అమ్మాయిలంతా నోట్లో నీళ్లు నింపుకొని రెడీ అయిపోయారు. ఇక అబ్బాయిల టీమ్ లీడర్ అయిన రోహిణి నవ్వించడానికి ప్రయత్నించింది. "యష్మీ ఆ మూతి ఎంత బావుందో తెలుసా.. ఆ మచ్చ మడతల్లోకెల్లి.." అంటూ ఏదేదో ట్రై చేసింది కానీ యష్మీ నవ్వలేదు. ఇక గంగవ్వను నవ్వించడానికి కూడా తెగ ట్రై చేసినప్పటికీ పనవ్వలేదు. అందరూ సీరియస్‌గా ఉన్నారు.. వీళ్లకి హాస్య గ్రంథులు కాదు ఏ గ్రంథులూ లేవు" అంటూ రోహిణి డైలాగ్ కొట్టింది. ఇంతలో బజర్ మోగింది. ఇక తర్వాత అబ్బాయిలంతా రెడీ అవ్వగా అమ్మాయిల టీమ్ లీడర్ అవినాష్ నవ్వించడానికి వచ్చాడు. ముందుగా మణికంఠ దగ్గరికెళ్లి.. "అఖిల బ్రహ్మాండకోటి.." అంటూ తననే ఇమిటేట్ చేశాడు. కాసేపు నవ్వు ఆపుకున్నా తర్వాత తట్టుకోలేక నవ్వేసి ఔట్ అయిపోయాడు మణి.

నామినేషన్స్​ వార్​: ఓజీ క్లాన్​ Vs రాయల్​ క్లాన్​ - మొత్తంగా ఈ వారం నామినేట్​ అయ్యింది వీరే!

గౌతమ్​ ఏడ్వడానికి కారణం: ఆ తర్వాత అశ్వత్థామ 2.0 వచ్చాడు.. అంటూ గౌతమ్ దగ్గరికెళ్లి నవ్వించడానికి ట్రై చేశాడు అవినాష్. ఇంతలో స్టేజ్ దిగిపోయి.. "సరేసరే బ్రో ఒన్ సెకండ్.." అంటూ అరిచాడు గౌతమ్. అసలు ఎవరికీ ఏం అర్థం కాలేదు. "అశ్వత్థామ అన్నది సీజన్ 7లో అయిపోయింది అది మళ్లీ మళ్లీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించకు బ్రో" అంటూ గౌతమ్ సీరియస్‌గా అన్నాడు. దీనికి ఏదో కామెడీ చేస్తే ఏంటి బ్రో అంటూ అవినాష్ అన్నాడు. "అది కామెడీ కాదు బ్రో.. నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది బ్రో" అంటూ మైక్ కింద పడేసి గౌతమ్ లోపలికి వెళ్లిపోయాడు. ఇక దీనికి హర్ట్ అయిన అవినాష్.. నేను స్టార్టింగ్‌లోనే ఎవరూ హర్ట్ అవ్వొద్దని చెప్పా.. నేను ఈ టాస్కు ఆడను బిగ్‌బాస్ అంటూ అవినాష్ కూడా సీరియస్ అయ్యాడు.

ఆ తర్వాత గౌతమ్‍ను సముదాయించేందుకు అవినాశ్ ప్రయత్నించారు. ఈ సందర్భంగా గౌతమ్ కన్నీరు పెట్టుకున్నారు. “సీజన్ 7లో ఆ విషయంలో చాలా ట్రోలింగ్ జరిగింది. దాన్ని తీయవద్దని చాలాసార్లు అనుకున్నా. సాధారణంగా నేను ఏడ్వను” అని గౌతమ్ ఏడ్చేశారు. సీజన్ 7లో తన మైండ్‍సెట్ వేరుగా ఉండేదని చెప్పారు. “ఒక సంవత్సరం కింద అన్నదానికి అప్పుడు నా మైండ్‍సెట్ వేరు. అప్పుడు నన్ను ఒక్కొక్కరు ఒక్కోలా ట్రీట్ చేస్తుంటే తట్టుకోలేక అన్న మాట అది. ఎంత మందికి చెప్పాలి” అని గౌతమ్ అన్నారు. ఈ విషయాలు తనకు తెలియదని అవినాశ్ అని గౌతమ్‍కు సారీ చెప్పారు.

ఇక తర్వాత కూడా పక్కకెళ్లి మళ్లీ ఎమోషనల్ అయ్యాడు గౌతమ్. "ఎవరో ఏదో అన్నారని నువ్వు ఫీల్ కాకురా.. నాన్న ఐయామ్ సారీ.. మాట్లాడకుండా వచ్చినా గొడవపడి.. మిమ్మల్ని గర్వపడేలా చేస్తా ఈసారి.. కప్పు కచ్చితంగా కొడతా" అంటూ తనలో తాను మాట్లాడుకున్నాడు.

ఉప్పు గిఫ్ట్​: నవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించు టాస్కులో ఎంటర్‌టైన్ చేసినందుకు కంటెస్టెంట్లకు ఓ ఉప్పు ప్యాకెట్‍ను బిగ్‍బాస్ గిఫ్ట్ ఇచ్చారు. ఈసారి రేషన్ తీసుకున్న సమయంలో ఉప్పు తీసుకోలేదు హౌజ్​మేట్స్. దీంతో ప్రైజ్‍మనీ నుంచి రూ.50వేలు తీసుకొని ఓ ప్యాకెట్ ఇచ్చారు బిగ్‍బాస్. ఇప్పుడు, మరో ఉప్పు ప్యాకెట్‍ను బహుమతిగా ఇచ్చారు. ఉప్పు గెలుచుకున్నందుకు లైఫ్‍లో ఇంత ఎప్పుడూ ఆనందపడలేదని రోహిణి అన్నారు.

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

హౌజ్​మేట్స్​ కాపాడినా ప్రేక్షకులు కరుణించలేదు - మూడో వారం అభయ్​​ ఎలిమినేట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

Bigg Boss 8 Gowtham Krishna Emotional: బిగ్‍బాస్ 8వ సీజన్‍లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది కంటెస్టెంట్లు హౌజ్​లోకి వచ్చిన విషయం తెలిసిందే. వైల్డ్​ కార్డ్స్ ఎంట్రీతో ఆట కాస్త ఇంట్రెస్టింగ్‍గా మారింది. ఈ క్రమంలోనే హౌజ్​మేట్స్​కు ఓ టాస్క్​ ఇవ్వగా.. గత సీజన్‍లో జరిగిన ఓ విషయాన్ని అవినాశ్ గుర్తు చేయడంతో గౌతమ్ ఫీలయ్యారు. ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. ఏంటి ఆ విషయం​? అక్టోబర్ 9వ నాటి ఎపిసోడ్​లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

టాస్క్​ ఇదే: అమ్మాయిలు, అబ్బాయిలను టీమ్‍లుగా విభజించి గేమ్ ఆడించారు బిగ్‍బాస్. అబ్బాయిలకు లీడర్‌గా రోహిణి, అమ్మాయిలకు హెడ్‍గా అవినాశ్ ఉండాలని చెప్పారు. దీంతో బిగ్‍బాస్ కన్‍ఫ్యూజ్ అయినట్టున్నారని, తాను అమ్మాయిని, అవినాశ్ అబ్బాయి అని రోహిణి చెప్పారు. దీంతో తాను సరిగానే చెప్పానని బిగ్‍బాస్ అన్నారు. ఈ క్రమంలోనే నవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించు అనే గేమ్ జరిగింది. నోటితో నీరు నింపుకున్న కంటెస్టెంట్‍ను నవ్విస్తే వారు ఔట్ అని బిగ్‍బాస్ చెప్పారు.

బిగ్‌బాస్ చెప్పిన దాని ప్రకారం ముందుగా అమ్మాయిలంతా నోట్లో నీళ్లు నింపుకొని రెడీ అయిపోయారు. ఇక అబ్బాయిల టీమ్ లీడర్ అయిన రోహిణి నవ్వించడానికి ప్రయత్నించింది. "యష్మీ ఆ మూతి ఎంత బావుందో తెలుసా.. ఆ మచ్చ మడతల్లోకెల్లి.." అంటూ ఏదేదో ట్రై చేసింది కానీ యష్మీ నవ్వలేదు. ఇక గంగవ్వను నవ్వించడానికి కూడా తెగ ట్రై చేసినప్పటికీ పనవ్వలేదు. అందరూ సీరియస్‌గా ఉన్నారు.. వీళ్లకి హాస్య గ్రంథులు కాదు ఏ గ్రంథులూ లేవు" అంటూ రోహిణి డైలాగ్ కొట్టింది. ఇంతలో బజర్ మోగింది. ఇక తర్వాత అబ్బాయిలంతా రెడీ అవ్వగా అమ్మాయిల టీమ్ లీడర్ అవినాష్ నవ్వించడానికి వచ్చాడు. ముందుగా మణికంఠ దగ్గరికెళ్లి.. "అఖిల బ్రహ్మాండకోటి.." అంటూ తననే ఇమిటేట్ చేశాడు. కాసేపు నవ్వు ఆపుకున్నా తర్వాత తట్టుకోలేక నవ్వేసి ఔట్ అయిపోయాడు మణి.

నామినేషన్స్​ వార్​: ఓజీ క్లాన్​ Vs రాయల్​ క్లాన్​ - మొత్తంగా ఈ వారం నామినేట్​ అయ్యింది వీరే!

గౌతమ్​ ఏడ్వడానికి కారణం: ఆ తర్వాత అశ్వత్థామ 2.0 వచ్చాడు.. అంటూ గౌతమ్ దగ్గరికెళ్లి నవ్వించడానికి ట్రై చేశాడు అవినాష్. ఇంతలో స్టేజ్ దిగిపోయి.. "సరేసరే బ్రో ఒన్ సెకండ్.." అంటూ అరిచాడు గౌతమ్. అసలు ఎవరికీ ఏం అర్థం కాలేదు. "అశ్వత్థామ అన్నది సీజన్ 7లో అయిపోయింది అది మళ్లీ మళ్లీ తీసి నాకు ఇరిటేషన్ తెప్పించకు బ్రో" అంటూ గౌతమ్ సీరియస్‌గా అన్నాడు. దీనికి ఏదో కామెడీ చేస్తే ఏంటి బ్రో అంటూ అవినాష్ అన్నాడు. "అది కామెడీ కాదు బ్రో.. నన్ను వెళ్లిపోమంటే వెళ్లిపోతా.. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది బ్రో" అంటూ మైక్ కింద పడేసి గౌతమ్ లోపలికి వెళ్లిపోయాడు. ఇక దీనికి హర్ట్ అయిన అవినాష్.. నేను స్టార్టింగ్‌లోనే ఎవరూ హర్ట్ అవ్వొద్దని చెప్పా.. నేను ఈ టాస్కు ఆడను బిగ్‌బాస్ అంటూ అవినాష్ కూడా సీరియస్ అయ్యాడు.

ఆ తర్వాత గౌతమ్‍ను సముదాయించేందుకు అవినాశ్ ప్రయత్నించారు. ఈ సందర్భంగా గౌతమ్ కన్నీరు పెట్టుకున్నారు. “సీజన్ 7లో ఆ విషయంలో చాలా ట్రోలింగ్ జరిగింది. దాన్ని తీయవద్దని చాలాసార్లు అనుకున్నా. సాధారణంగా నేను ఏడ్వను” అని గౌతమ్ ఏడ్చేశారు. సీజన్ 7లో తన మైండ్‍సెట్ వేరుగా ఉండేదని చెప్పారు. “ఒక సంవత్సరం కింద అన్నదానికి అప్పుడు నా మైండ్‍సెట్ వేరు. అప్పుడు నన్ను ఒక్కొక్కరు ఒక్కోలా ట్రీట్ చేస్తుంటే తట్టుకోలేక అన్న మాట అది. ఎంత మందికి చెప్పాలి” అని గౌతమ్ అన్నారు. ఈ విషయాలు తనకు తెలియదని అవినాశ్ అని గౌతమ్‍కు సారీ చెప్పారు.

ఇక తర్వాత కూడా పక్కకెళ్లి మళ్లీ ఎమోషనల్ అయ్యాడు గౌతమ్. "ఎవరో ఏదో అన్నారని నువ్వు ఫీల్ కాకురా.. నాన్న ఐయామ్ సారీ.. మాట్లాడకుండా వచ్చినా గొడవపడి.. మిమ్మల్ని గర్వపడేలా చేస్తా ఈసారి.. కప్పు కచ్చితంగా కొడతా" అంటూ తనలో తాను మాట్లాడుకున్నాడు.

ఉప్పు గిఫ్ట్​: నవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించు టాస్కులో ఎంటర్‌టైన్ చేసినందుకు కంటెస్టెంట్లకు ఓ ఉప్పు ప్యాకెట్‍ను బిగ్‍బాస్ గిఫ్ట్ ఇచ్చారు. ఈసారి రేషన్ తీసుకున్న సమయంలో ఉప్పు తీసుకోలేదు హౌజ్​మేట్స్. దీంతో ప్రైజ్‍మనీ నుంచి రూ.50వేలు తీసుకొని ఓ ప్యాకెట్ ఇచ్చారు బిగ్‍బాస్. ఇప్పుడు, మరో ఉప్పు ప్యాకెట్‍ను బహుమతిగా ఇచ్చారు. ఉప్పు గెలుచుకున్నందుకు లైఫ్‍లో ఇంత ఎప్పుడూ ఆనందపడలేదని రోహిణి అన్నారు.

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

హౌజ్​మేట్స్​ కాపాడినా ప్రేక్షకులు కరుణించలేదు - మూడో వారం అభయ్​​ ఎలిమినేట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.