ETV Bharat / state

Lockdown implementation: పోలీసులకు గుడ్లు, భోజనం అందజేసిన రాచకొండ ఏసీపీ - పోలీసులకు గుడ్లు, భోజనం అందజేసిన రాచకొండ ఏసీపీ సుదీర్ బాబు

యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న చెక్ పోస్ట్​ను రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గుడ్లు, భోజనాన్ని అందజేశారు.

rachakonda acp sudheer babu distributed food and eggs to police
పోలీసులకు గుడ్లు, భోజనం అందజేసిన రాచకొండ ఏసీపీ
author img

By

Published : May 29, 2021, 3:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు సందర్శించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లాక్​డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి రాగాల ఫౌండేషన్ సహకారంతో గుడ్లు, భోజనాన్ని అందజేశారు.

సుధీర్ బాబు వాహనదారులను తనిఖీ చేసి వారి వద్ద ఉన్ ఈ-పాసులను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుధీర్​తో పాటు యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి, ట్రాఫిక్ సీఐ సతీశ్, భువనగిరి రూరల్ సీఐ జానయ్య, సీఐ శివ శంకర్, బీబీనగర్ ఎస్సై రాఘవేందర్ ఉన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును రాచకొండ అడిషనల్ కమిషనర్ సుధీర్ బాబు సందర్శించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లాక్​డౌన్ అమలు తీరును పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి రాగాల ఫౌండేషన్ సహకారంతో గుడ్లు, భోజనాన్ని అందజేశారు.

సుధీర్ బాబు వాహనదారులను తనిఖీ చేసి వారి వద్ద ఉన్ ఈ-పాసులను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సుధీర్​తో పాటు యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి, ట్రాఫిక్ సీఐ సతీశ్, భువనగిరి రూరల్ సీఐ జానయ్య, సీఐ శివ శంకర్, బీబీనగర్ ఎస్సై రాఘవేందర్ ఉన్నారు.

ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.