కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు.. దాతలు తమకు తోచినంత సహాయం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఏరియా ఆస్పత్రికి.. రోటరీ క్లబ్ అమీర్ పేట ఆధ్వర్యంలో మాస్కులు, రెండు ఫ్రీజర్లు అందజేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
విపత్కర పరిస్థితుల్లో రోగులకు అండగా నిలిచిన క్లబ్ సభ్యులను ఈ సందర్భంగా సునీతా సన్మానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి: నార్కట్పల్లి విద్యుత్ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం