యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పట్టణంలోని పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
నియోజక వర్గ వ్యాప్తంగా అన్ని శివాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. భక్తులు ఉదయం నుంచే శివాలయాలకు క్యూ కట్టారు. ప్రజలంతా కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్లా శివాలయాల నిర్వాహకులు కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా ఎవరికీ అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి: 'టీవీ సౌండ్ ఎక్కువ పెట్టాడని ఓనర్నే లేపేశాడు'