నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించడం కోసం.. సొంతంగా పరిశ్రమలు పెట్టే వారికోసం.. తుర్కపల్లి మండలంలో రెండు ప్రభుత్వ స్థలాలు ఉండగా... అందులో ఒకచోట ఇండస్ట్రీయల్ పార్క్ నెలకొల్పేందుకు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే గొంగిడి సునీత తుర్కపల్లిలో పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకై సమావేశం నిర్వహించారు. పరిశ్రమలు పెట్టాలంటే నీళ్లు కూడా చాలా ముఖ్యమని... ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రెండు మూడు నెలల్లోనే ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: 'రాజ్యసభకే అవమానకరమైన రోజు ఇది'