యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్ డౌన్ అమలుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మోటకొండూరు మండల పరిధిలోని ముత్తి రెడ్డి గూడెంలోని రాయగిరి-మోత్కూరు రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఎస్సై డి.నాగరాజు వాహన తనిఖీ నిర్వహించారు. అనవసరంగా బయటకు వస్తున్న వాహన దారులకు అవగహన కల్పించారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు ఫైన్లు వేస్తున్నారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కరోనా పోరులో అందరూ కలిసి మహమ్మారి కట్టడికి సహరించాలని కోరారు. నిర్ణీత సమయం తర్వాత రోడ్లు మీదికి వస్తే.. ఫైన్లతో పాటు వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: ప్రముఖ నేపథ్య గాయకుడు ఏవీఎన్ మూర్తి మృతి