దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు భువనగిరి తెరాస అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. గత ఐదేళ్లలో తాను పార్లమెంట్లో వివిధ సమస్యలపై 66 సార్లు గళం విప్పానని గుర్తుచేశారు. గతంలో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఐదేళ్లలో ఐదుసార్లు మాట్లాడితే.. అందులో తన సొంత కాంట్రాక్టుల గురించే మూడు సార్లు మాట్లాడారని విమర్శించారు. తాను ఇప్పటికే సాధించిన ఎయిమ్స్కు వెంటనే శంకుస్థాపన చేసి పూర్తి స్థాయి ఆస్పత్రిగా ప్రజలకు అందుబాటులోకి తేవడమే తన ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. వీటితో పాటు రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు తీసుకురావడం, జాతీయ రహదారుల పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:'మాటమీద ఎవరుంటారో ప్రజలకు తెలుసు'