ETV Bharat / state

యాదగిరి గుట్టలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ

author img

By

Published : Sep 28, 2020, 12:22 PM IST

Updated : Sep 28, 2020, 1:39 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతోందని ప్రజాప్రతినిధులు అన్నారు. యాదగిరి గుట్ట తహసీల్దారు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేసిన ఆలేరు ఎమ్మెల్యే
కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దారు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనూరాధ లబ్ధిదారులకు చెక్కులు అందించారు.

పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అందిస్తోన్న సహాయం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతోందని ప్రజాప్రతినిధులు అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దారు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు పంపిణీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనూరాధ లబ్ధిదారులకు చెక్కులు అందించారు.

పేదింటి ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అందిస్తోన్న సహాయం వల్ల ఎంతో మందికి లబ్ధి చేకూరుతోందని ప్రజాప్రతినిధులు అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'రైతు వేదికలు పూర్తయితే అనేక ప్రయోజనాలు'

Last Updated : Sep 28, 2020, 1:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.