చావా ఫౌండేషన్, ఆర్.కె. హాస్పిటల్ డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో 72వ ఉచిత వైద్య శిబిరాన్ని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. పల్లె పల్లెకి ఉచిత వైద్య శిబిరంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం ప్రారంభించారు.
వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పెద్ద కందుకూరు సర్పంచ్ భీమగాని రాములు కోరారు. సుమారు 200 మందికి బీపీ, షుగర్, గుండె, ఛాతి, రక్త పరీక్షలు నిర్వహించి.. ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మచ్చ లక్ష్మీనారాయణ, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే పీవీకి సరైన గౌరవం'