అకాల వర్షాలతో చేతిదాకా వచ్చిన పంట నీటిపాలైంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలో కురిసిన వర్షానికి ఐకేపీ, పీఎసీఎస్ కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దైంది. దత్తాయిపల్లి గ్రామంలో రైతులు అధికారులకు, కలెక్టర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయారు.
![Grain soaked with un seasonal rains, grain loss due to rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:17:48:1621565268_tg-nlg-85-20-aler-ikp-la-lo-raithula-ibbandhulu-av-ts10134_20052021222727_2005f_1621529847_283.jpg)
ధాన్యం పండించడం ఒక కష్టమైతే... అమ్ముకోవడం గగనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోస్తే... వర్షానికి పూర్తిగా తడిసి మొలకెత్తిందని వాపోయారు.
ఇదీ చదవండి: ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే..