యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మెర్సీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హరిత టూరిజంలో పనిచేసే కార్మికులకు 25కిలోల బియ్యం బ్యాగులను పంపిణీ చేశారు. వీటితోపాటు మాస్కులు, శానిటైజర్స్ను అందించారు.
ప్రజలందరూ ప్రభుత్వ సూచనలను పాటిస్తూ కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు పాటుపడాలని పేర్కొన్నారు. అత్యవసరంగా బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని కోరారు. వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడించారు. కార్యక్రమంలో హరిత టూరిజం మేనేజర్ జంగయ్య, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.