రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా అవుతుండటం వల్ల ప్రభుత్వం ఆంక్షలు కఠినతరం చేసింది. ఎవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలంలోని చౌళ్లరామారం వద్ద గల జిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న వలస కూలీలకు రెడ్క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో మాస్క్లు ఉచితంగా పంపిణీ చేశారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతికదూరం పాటిస్తే కరోనా మన చెంతకు చేరదని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలి: జీవన్రెడ్డి