యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విన్ కుమాన్ చౌబే పర్యటించారు. బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించారు. స్థానిక భారతీయ జనతా పార్టీ శ్రేణులు కేంద్రమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఎయిమ్స్ ఆవరణలో అశ్విన్ కుమార్ మొక్క నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుదర్ పాల్గొన్నారు.
ఇవీచూడండి: కాకతీయ వైద్య కళాశాలలో ఆకట్టుకున్న ఉత్కర్ష