ETV Bharat / state

'సెల్​ టవర్​ను తొలగించాలని స్థానికుల ఆందోళన'

యాదాద్రి భువనగిరి జిల్లా  మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్న సెల్​టవర్ తొలగించాలని స్థానికుల ఆందోళన చేపట్టారు.

author img

By

Published : Aug 28, 2019, 1:36 PM IST

'సెల్​ టవర్​ను తొలగించాలని స్థానికుల ఆందోళన'

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఓ సెల్​టవర్​ను తొలగించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. రేడియేషన్ వల్ల అనేక మానసిక, శారీరక సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నామన్నారు. జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ టవర్ లీజు సమయం ముగిసినా టవర్​ను వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు టవర్ వద్దకు రాగా వారిని స్థానికులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. తమ లీజు గడువు ముగిసే వరకు ఈ టవర్ వినియోగంలోనే ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు సర్దిచెప్పి ఆందోళనను విరమింప చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్​ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఓ సెల్​టవర్​ను తొలగించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. రేడియేషన్ వల్ల అనేక మానసిక, శారీరక సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నామన్నారు. జిల్లా పాలనాధికారికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ టవర్ లీజు సమయం ముగిసినా టవర్​ను వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంపెనీ ప్రతినిధులు టవర్ వద్దకు రాగా వారిని స్థానికులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. తమ లీజు గడువు ముగిసే వరకు ఈ టవర్ వినియోగంలోనే ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. పోలీసులు వచ్చి ఇరు వర్గాలకు సర్దిచెప్పి ఆందోళనను విరమింప చేశారు.


ఇదీ చూడండి:బరువైన బాల్యం.. బడి బ్యాగు భయపెడుతోంది!

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.Body:యాదాద్రి భువనగిరి జిల్లా ; మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో వోడాఫోన్ టవర్ తోలగించాలని స్థానికుల ఆందోళన.
సుమారు 15 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన వోడాఫోన్ సెల్ టవర్ తో వెలువడుతున్న రేడియేషన్ వల్ల స్థానికులకు మానసిక, శారీరక సంబంధిత రుగ్మతలతో భాదపడుతున్నాలరని, వైద్యానికి వేలాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని, గతంలో ఎన్నో సార్లు ఈ టవర్ నఉ తొలగించాలని ఆందోళన చేశామని జిల్లా పాలనాధికారికి పిర్యాదు చేసినా ఫలితం లేదని ,ఈ టవర్ లీజు సమయం ముగిసినా టవర్ ను వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ టవర్ ను 2 g నుంచి 4g సేవల విస్తరణ పనులు చేయుటకు కంపనీ ప్రతినిధులు టవర్ వద్దకు రాగా వారిని స్థానికులు అడ్డుకోవడంతో స్థానికులు కు కంపెనీ ప్రతినిధులకు మధ్య వాగ్వివాదం జరిగింది.
12 ఏప్రిల్ 2024 వరకు వోడాఫోన్ సెల్ ఫోన్ టవర్ లీజు గడువు తమకు ఉన్నాయని అప్పటి వరకు సెల్ టవర్ వినియోగంలోనే ఉంటుందని తేల్చి చెప్పారు.
ప్రభుత్వం నుంచి ఈ టవర్ తో ప్రజలకు హాని కలుగుతుందని ఆదేశాలు వచ్చేవరకు పనులు కొనసాతారని కంపనీ ప్రతినిధులు తెలిపారు.
స్థానికులు 100 కు కాల్ చేయగా పోలీసులు వచ్చి ఇరు వర్గాలమద్య సర్దిచెప్పి ఆందోళన విరమింప చేశారు.
ఇకనైనా అధికారులు స్పందించి కాలనీలో ఉన్నటువంటి వోడాఫోన్ సెల్ టవర్ తొలగించాలని స్థానికులు కోరుతున్నారుConclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.