యాదాద్రి భువనగిరి జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. తుర్కపల్లి మండలం ముల్కల పల్లి గ్రామంలో కిష్టయ్య అనే గొర్ల కాపరి గొర్రెకి ఆరు కాళ్లతో గొర్రె పిల్ల జన్మించింది. దీన్ని చూడగానే వారి చుట్టు పక్కల ఉన్న వారు ఆశ్చర్యానికి గురైయ్యారు. ఈ ఆరు కాళ్ల గొర్రె పిల్లను చూడటానికి పక్కన గ్రామాల నుంచి కూడా వస్తున్నారని ఆ గొర్రెల యజమాని తెలిపారు.
కాపరికి అతని మందలో వంద గొర్రెలు ఉండగా నిన్న రాత్రి గొర్రె.. పిల్లలు చేయగా ఒక దానికి ఆరు కాళ్లు రావటంతో మొదటగా ఆశ్చర్యానికి గురయ్యారు.

- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ