యాదాద్రి జిల్లా భువనగిరిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పీ ఛైర్మన్ సందీప్రెడ్డి, కలెక్టర్ అనిత రామచంద్రన్, ఎమ్మెల్యే శేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఏ స్థాయిలో ఉన్న మహిళలయినా చీరలంటే ఎంతో ఇష్టపడతారని కలెక్టర్ అన్నారు. సంతోషంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే శేఖర్రెడ్డి అన్నారు. ప్రతి సంవత్సరం చీరల నాణ్యత మెరుగవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. నేతన్నలకు ఆర్థిక అండ దొరుకుతుందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: సీఎం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు