ETV Bharat / state

'ఇసుక తరలింపును వెంటనే ఆపేయండి' - 'ఇసుక తరలింపును వెంటనే ఆపేయండి'

తమ గ్రామం నుంచి మల్లన్న సాగర్​ రిజర్వాయర్​కు ఇసుక తరలింపును నిలిపివేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా బండ కొత్తపల్లి ప్రజలు ఆందోళనకు దిగారు. కలెక్టర్​ ఎదుట నిరసన వ్యక్తం చేసిన గ్రామస్థులు... జాయింట్​ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

BANDA KOTHAPALLY VILLAGERS PROTESTED TO STOP SAND EVACUATION
BANDA KOTHAPALLY VILLAGERS PROTESTED TO STOP SAND EVACUATION
author img

By

Published : Dec 11, 2019, 6:56 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామస్థులు కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామం నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్​కు ఇసుక తరలింపు నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఇసుక తవ్వకాల అనుమతిని రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే రెండు దఫాలుగా కాంట్రాక్టర్లు ఇసుకను తరలించారని తెలిపారు. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఇసుక ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందని వాపోయారు. ఇసుక తరలింపు వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయి.. తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాల ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రమేష్​కు గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు.

'ఇసుక తరలింపును వెంటనే ఆపేయండి'

ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామస్థులు కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ గ్రామం నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్​కు ఇసుక తరలింపు నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఇసుక తవ్వకాల అనుమతిని రద్దు చేయాలని కోరారు. ఇప్పటికే రెండు దఫాలుగా కాంట్రాక్టర్లు ఇసుకను తరలించారని తెలిపారు. 30 అడుగుల ఎత్తులో ఉన్న ఇసుక ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చిందని వాపోయారు. ఇసుక తరలింపు వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయి.. తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తవ్వకాల ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ రమేష్​కు గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు.

'ఇసుక తరలింపును వెంటనే ఆపేయండి'

ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!

TG_NLG_61_11_ISUKA_RAVANA_AV_TS10061 రిపోర్టర్ : సతీష్ శ్రీపాద సెంటర్ : భువనగిరి జిల్లా : యాదాద్రి భువనగిరి సెల్ : 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లి గ్రామం నుండి మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు ఇసుక తరలింపు నిలిపివేయాలని గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఇసుక తొవ్వకాల అనుమతిని రద్దు చేయాలని బండ కొత్తపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామ పెద్దలు గ్రామ సభ నిర్వహించకుండానే కుండానే, కేవలం గ్రామస్తుల సంతకాలు తీసుకుని ఆ తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పేపర్ మీద రాసుకొని అనుమతి ఇచ్చినట్లు సృష్టించారని అన్నారు. ఎగువన ఉన్న దేవరుప్పుల, కామారెడ్డి గూడెం, సీతారాంపురం ల వద్ద చెక్ డ్యాములు నిర్మించారాని అక్కడి నుంచే వాగుల ద్వారా నీరు, ఇసుక మా వద్దకు వస్తుందని. అక్కడ చెక్ డ్యామ్ నిర్మించడంతో ఇసుక దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికే బండ కొత్తపల్లి గ్రామంలో రెండు దఫాలుగా ఇసుకను సదరు కాంట్రాక్టర్ తరలించుకొని వెళ్లారని , 30 ఫీట్ల ఎత్తులో ఉన్న ఇసుక కాస్త సాధారణ స్థితికి వచ్చిందని, ఇసుక తొవ్వకాల ఉత్తర్వులను కలెక్టర్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇసుకను గ్రామం నుంచి తలవంచుకొని వెళ్తే రైతులు తీవ్రంగా నష్టపోతామని, భూగర్భ జలాలు అడుగంటి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఇసుక తవ్వకాలకు ఇచ్చిన అనుమతిని వెంటనే వెనక్కి తీసుకోవాలని బండ కొత్తపల్లి గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ రమేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.