ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణ అధికారిగా, ఏన్. గీతా రెడ్డి సర్వీసు మరో ఏడాది పొడిగిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న ఆమెను ఆలయ ఈఓగా ప్రభుత్వం డిసెంబర్ 3వ తేదీ 2014న నియమించింది.
అప్పటినుంచి ఈ ఓగా కొనసాగిన ఆమె ఈ ఏడాది ఫిబ్రవరి 29న ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. సీఎం కేసీఆర్ సంకల్పంతో క్షేత్రస్థాయి అభివృద్ధి జరుగుతున్నందున... ఆమె సర్వీస్ కాలాన్ని పొడగిస్తూ... మరో ఏడాదిపాటు విధులు నిర్వర్తించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో తనకు ఈ అవకాశం లభించిందని ఆలయ ఈవో గీత పేర్కొన్నారు.
ఇవీ చూడండి: అక్రమ వసూళ్లు.. అవినీతి 'రహదారి'..!