ETV Bharat / state

అనిశా వలలో అంబాల వీఆర్వో, వీఆర్​ఏ - acb got ambala vro and vra redhanded while taking bribe In yadadri bhuwanagiri district

యాదాద్రి భువనగిరి జిల్లా అంబాల గ్రామ వీఆర్వో అనిశా వలలో చిక్కాడు. ఎల్లయ్య అనే రైతు వద్ద 42 వేల రూపాయలు లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

అనిశా వలలో అంబాల వీఆర్వో, వీఆర్​ఏ
author img

By

Published : Jul 6, 2019, 9:43 AM IST

అనిశా వలలో అంబాల వీఆర్వో, వీఆర్​ఏ

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య అనే రైతు తన మూడెకరాల భూమిని ప్రొసిడింగ్​ చేయాలని వీఆర్వోను కోరగా... ఎకరానికి 20వేలు లంచం డిమాండ్​ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేని ఆ రైతు అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గ్రామ వీఆర్వో శ్రీను అతనికి సహకరించిన వీఆర్​ఏ యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 42 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

అనిశా వలలో అంబాల వీఆర్వో, వీఆర్​ఏ

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన చిన్న ఎల్లయ్య అనే రైతు తన మూడెకరాల భూమిని ప్రొసిడింగ్​ చేయాలని వీఆర్వోను కోరగా... ఎకరానికి 20వేలు లంచం డిమాండ్​ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేని ఆ రైతు అనిశా అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గ్రామ వీఆర్వో శ్రీను అతనికి సహకరించిన వీఆర్​ఏ యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 42 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet.

acb వలలో యాదాద్రి జిల్లా గుండాల మండల VRO,VRAలు

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అంబాల గ్రామ విఆర్వో నల్ల శ్రీను అదే గ్రామానికి చెందిన చిన్న నర్రాముల చిన్న ఎల్లయ్య అనే రైతు వద్ద గుండాల మండల తహశీల్దార్ కార్యాలయంలో 42 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు నేరుగా పట్టుబడినాడు.

వివరాల్లోకి వెళితే గుండాల మండలం సుద్దాల, బ్రాహ్మణ పెల్లి గ్రామాల VRO నల్ల శ్రీను అంబాల గ్రామానికి ఇంచార్జ్ VRO గా విధులు నిర్వర్తిస్తూ అదే గ్రామంలోని నర్రెంల చిన్న ఎల్లయ్య రైతు తన 4ఎకరాల 20గుంటల భూమిన లో ఒక సాదాబైనామాకు ఎకరం ప్రొసిడింగ్ రాగా మిగిలిన మూడెకరాల భూమి ని ప్రొసిడింగ్ చేయుటకు ఎకరానికి 20 వేల రూపాయల లంచం ఇవ్వవలసింందిగా వత్తిడి చేయగా ఇప్పటికే సకాలంలో వర్షాలు పడక అప్పుల భాదభరించలేక పోతున్న తను vro కు అడిగినంత లంచం ఇవ్వలేక భాద పడుతు తరుణంలో గత నెలలో గుండాల కరెంట్ డిపార్ట్మెంట్ ఎఇ ని యాదాద్రి భువనగిరి జిల్లా బిబినగర్ టోల్గెట్ వద్ద అనిశ అధికారులు AEని పట్టుకున్న విషయాన్ని తెలుసుకొని అదే తోవలో VROను అనిశా కు పట్టంచాలని ఆలోచనతో నల్లగొండ అనిశా అధికారులకు పిర్యాదు చేశాడు ఎల్లయ్య.
నిన్న జరిగిన vro బదిలీ లలో సదరు VRO గుండాల మండలం నుంచి యాదగిరిగుట్ట పెద్దకందుకూరు గ్రామానికి బదిలీ కాగా తన దస్తావేజులను గుండాల తహసీల్దార్ కార్యాలయంలో అప్పగించుటకు వస్తూ రైతు ఎల్లయ్య కు చారవాణి ద్వారా సమాచారం ఇచ్చాడు నేను గుండాల తహసీల్దార్ కార్యాలయం కు వస్తున్నానని డబ్బులు తీసుకురావాలని తెలుపగా రైతు విషయాన్ని నల్లగొండ అనిశ అదికారులకు తెలిపాడు. ఈరోజు సాయంత్రం 4గం సమయంలో VROనల్ల శ్రీను రైతును పిలిచి డబ్బులను గ్రామ VRA తుంగ యాదగిరికి ఇవ్వవలసిందిగా తెలిపాడు. అలానే రైతు ఎల్లయ్య VRAయాదగిరి కి డబ్బులు ఇస్తుండగా అప్పటికే గుండాల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న అనిశ అధికారి DSP ఆనంద్ కుమార్ SI రఘు , లింగస్వామి బృందం డబ్బులు తీసుకుంటున్న VRA యాదగిరి ని అదుపులోకి తీసుకొని ఫింగర్ ప్రింట్ పరీక్షలు నిర్వహించారు పరీక్షలు అనిశ వారికి అనుకూలంగా రావడంతో సదరు VRO,VRAలను అదుపులోకి తీసుకొని 42వేలరూపాయలను రికవరి చేసుకున్నట్లు తెలిపాడు.


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.