ETV Bharat / state

యాదాద్రి బస్టాండ్​కు 6 ఎకరాలు... ముమ్మరంగా అభివృద్ధి పనులు - yadadri updates

యాదాద్రిలో జరుగుతున్న నిర్మాణ పనులు మరింత చురుకుగా సాగుతున్నాయి. భక్తులకు అనువైన బస్టాండ్​ నిర్మాణం కోసం యాడా ఆధ్వర్యంలోని 6 ఎకరాల స్థలాన్ని ఆర్టీసీకి అప్పగించనున్నారు. మరోవైపు కొండపై పనులు మరింత చురుకుగా సాగుతున్నాయి.

6 acres place given to yadadri bus stand
6 acres place given to yadadri bus stand
author img

By

Published : Jan 29, 2021, 11:31 AM IST

యాదాద్రి క్షేత్రాన్ని మౌలిక వసతులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే క్రమంలో అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఈ క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి పరిచే క్రమంలో... యాడా సేకరించి, కొనుగోలు చేసిన స్థలంలోని గండిచెరువు వద్ద గల 6 ఎకరాల భూమిలో బస్​స్టేషన్​ నిర్మించాలని నిర్ణయించారు.

సకల హంగులతో భక్తులకు అనువైన బస్టాండ్​ నిర్మించేందుకు ఈ భూమిని ఆర్టీసీకి అప్పగించనున్నారు. మల్లాపురం శివారులో డిపో కోసం ఇప్పటికే పది ఎకరాలు కేటాయించారు. సీఎంవో భూపాల్ రెడ్డి ఆదేశాలతో స్థలం అప్పగించే తతంగానికి రంగం సిద్ధమైంది.

6 acres place given to yadadri bus stand
బస్టాండ్​ నిర్మించే స్థలం...

కొండపై వేగంగా పనులు...

యాదాద్రిలో జరుగుతున్న నిర్మాణ పనులు మరింత చురుకుగా సాగుతున్నాయి. కొండపై చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ఆదేశించగా... హరిహరుల ఆలయాలకు చెందిన కట్టడాలు ముమ్మరమయ్యాయి.

6 acres place given to yadadri bus stand
తుది మెరుగులద్దుతున్న కార్మికులు...

శివాలయ పునర్ నిర్మాణంలో ఉపఆలయాలకు సంప్రదాయంగా హంగులద్దుతున్నారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే భక్తుల కోసం కాంప్లెక్స్​లోని మొదటి అంతస్తులో దర్శన వరుసల ఏర్పాట్లు పూర్తి కాగా... ఆ కింది ఫ్లోర్​లో గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

6 acres place given to yadadri bus stand
క్యూలైన్లు సిద్ధం...

ఇదీ చూడండి: నిరుద్యోగులకు శుభవార్త... భృతిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన!

యాదాద్రి క్షేత్రాన్ని మౌలిక వసతులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే క్రమంలో అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. ఈ క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి పరిచే క్రమంలో... యాడా సేకరించి, కొనుగోలు చేసిన స్థలంలోని గండిచెరువు వద్ద గల 6 ఎకరాల భూమిలో బస్​స్టేషన్​ నిర్మించాలని నిర్ణయించారు.

సకల హంగులతో భక్తులకు అనువైన బస్టాండ్​ నిర్మించేందుకు ఈ భూమిని ఆర్టీసీకి అప్పగించనున్నారు. మల్లాపురం శివారులో డిపో కోసం ఇప్పటికే పది ఎకరాలు కేటాయించారు. సీఎంవో భూపాల్ రెడ్డి ఆదేశాలతో స్థలం అప్పగించే తతంగానికి రంగం సిద్ధమైంది.

6 acres place given to yadadri bus stand
బస్టాండ్​ నిర్మించే స్థలం...

కొండపై వేగంగా పనులు...

యాదాద్రిలో జరుగుతున్న నిర్మాణ పనులు మరింత చురుకుగా సాగుతున్నాయి. కొండపై చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ మరో వారం రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి ఆదేశించగా... హరిహరుల ఆలయాలకు చెందిన కట్టడాలు ముమ్మరమయ్యాయి.

6 acres place given to yadadri bus stand
తుది మెరుగులద్దుతున్న కార్మికులు...

శివాలయ పునర్ నిర్మాణంలో ఉపఆలయాలకు సంప్రదాయంగా హంగులద్దుతున్నారు. ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే భక్తుల కోసం కాంప్లెక్స్​లోని మొదటి అంతస్తులో దర్శన వరుసల ఏర్పాట్లు పూర్తి కాగా... ఆ కింది ఫ్లోర్​లో గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

6 acres place given to yadadri bus stand
క్యూలైన్లు సిద్ధం...

ఇదీ చూడండి: నిరుద్యోగులకు శుభవార్త... భృతిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.