ETV Bharat / state

నీటికోసం బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు

author img

By

Published : Mar 29, 2019, 3:51 PM IST

గొంతెండిపోతోంది తాగునీరివ్వండి మహాప్రభో అంటే వినే నాథుడే కరవయ్యాడు.. అధికారులకు తమ నీటి కష్టాలు వినిపించి వినిపించి విసుగు చెందారు. పాలకులు, అధికారుల తీరుమారక పోయేసరికి ప్రజలు తమ రూటే మార్చారు. నీటి కోసం రోడ్డుపై బిందెలు, డ్రమ్ములను అడ్డంగా పెట్టి నిరసనకు దిగారు.

నీటికోసం అతివల పాట్లు
నీటికోసం అతివల పాట్లు
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలో మహిళలు నీటికోసం రోడ్డెక్కారు. రోడ్డుకు అడ్డంగా బిందెలను, డ్రమ్ములను పెట్టి నిరసనకు దిగారు. మడికొండలోని 34వ డివిజన్​లో తాగునీటి సరఫరా అధ్వానంగా ఉందని వాపోయారు. వారానికొకసారి వచ్చే నల్లా నీళ్లు కనీస అవసరాలకు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

పక్కదారి పడుతున్న ట్యాంకర్లు

మున్సిపాలిటీ వారు సరఫరా చేసే ట్యాంకర్లను సిబ్బంది నగదుకు ఆశపడి బయటివారికి అమ్మకుంటున్నారని ఆరోపించారు. తమ గోడు ఎన్ని సార్లు విన్నవించినా హామీలే తప్ప చేతల్లో కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్తంభించిన ట్రాఫిక్​ తరలివచ్చిన పోలీసులు

మహిళల నిరసనతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వారికి సర్దిచెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. చేసేదేమీ లేక మహిళలను అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించి ట్రాఫిక్​ పునరుద్ధరించారు.

ఇదీ చదవండి:నిట్​లో ర్యాగింగ్​... ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్​​

నీటికోసం అతివల పాట్లు
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలో మహిళలు నీటికోసం రోడ్డెక్కారు. రోడ్డుకు అడ్డంగా బిందెలను, డ్రమ్ములను పెట్టి నిరసనకు దిగారు. మడికొండలోని 34వ డివిజన్​లో తాగునీటి సరఫరా అధ్వానంగా ఉందని వాపోయారు. వారానికొకసారి వచ్చే నల్లా నీళ్లు కనీస అవసరాలకు సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

పక్కదారి పడుతున్న ట్యాంకర్లు

మున్సిపాలిటీ వారు సరఫరా చేసే ట్యాంకర్లను సిబ్బంది నగదుకు ఆశపడి బయటివారికి అమ్మకుంటున్నారని ఆరోపించారు. తమ గోడు ఎన్ని సార్లు విన్నవించినా హామీలే తప్ప చేతల్లో కనిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్తంభించిన ట్రాఫిక్​ తరలివచ్చిన పోలీసులు

మహిళల నిరసనతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వారికి సర్దిచెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. చేసేదేమీ లేక మహిళలను అదుపులోకి తీసుకొని పోలీస్​స్టేషన్​కు తరలించి ట్రాఫిక్​ పునరుద్ధరించారు.

ఇదీ చదవండి:నిట్​లో ర్యాగింగ్​... ఐదుగురు విద్యార్థుల సస్పెన్షన్​​

Intro:tg_kmm_7_29_madhira lo poling kendralanu pariseelinchina ennikala pariseelakulu_av_-c1_kit no 889 ఎం కృష్ణ ప్రసాద్ 8008573685 ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మధిర లో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుల బృందం ఆకస్మికంగా సందర్శించింది మధిర నియోజకవర్గంలో లో మొత్తం 2,10,358 మంది ఓటర్లు ఉండగా నియోజకవర్గంలోని మధిర ముదిగొండ చింతకాని ఎర్రుపాలెం బోనకల్ మండలాల్లో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ కేంద్రాల్లో వసతులు ఎలా ఉన్నాయి వికలాంగులు వృద్ధులు ఓటు వేసేందుకు వచ్చిన సమయంలో లో లో ప్లాట్ఫాంలు ఏర్పాటు చేశారా లేదా అనే విషయాలను స్వయంగా పరిశీలించారు అంతేకాకుండా కేంద్రాలలో చిత్తూరు సౌకర్యం ఎలా ఉంది అనే విషయాన్ని తాసిల్దార్ ర్ రెవిన్యూ సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు


Body:కె.పి


Conclusion:కె.పి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.