ప్లాటినం జూబ్లీ వేడుకలకు వరంగల్ నగరంలోని ఏవీవీ జూనియర్ కళాశాల ముస్తాబవుతోంది. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలోని పిచ్చిమొక్కలను, చెత్తాచెదారాన్ని రెండు వందల మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శుభ్రం చేస్తున్నారని ఎన్ఎస్ఎస్ ప్రోగాం ఆఫీసర్ గోపి తెలిపారు.
75 వసంతాలు పూర్తి చేసుకున్న కళాశాల వార్షికోత్సవాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రావడం అధ్యాపకులు, విద్యార్థులకు నూతన ఉత్తేజాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వైభవంగా చేస్తున్నామని తెలిపింది.
ఇదీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ