ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. అర్బన్ జిల్లాలో నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఇద్దరికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.
జిల్లాలో మొత్తం ఏడు కేసులు
నగరంలోని శివనగర్కు చెందిన 54 ఏళ్ల వ్యక్తికి, హన్మకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన 52ఏళ్ల వ్యక్తికి వైరస్ సోకినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రాథమిక కాంటాక్టును పట్టుకునేందుకు వైద్యులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వారి కుటుంబసభ్యులను క్వారంటైన్కు తరలించారు. జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఏడుకు చేరుకుంది.
ఇదీ చూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం