కరోనా మానవతా విలువలను, రక్త సంబంధాలను తుడిచివేస్తోందని చెప్పడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. ముదిమి వయస్సులో తోడుగా ఉండాల్సింది పోయి.. కొవిడ్ సోకిందనే కారణంతో 80 ఏళ్ల వృద్ధురాలైన తల్లిని కొడుకులే కాదని వ్యవసాయ బావి వద్ద వదిలివెళ్లారు. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద బిక్కుబిక్కు మంటూ ఆ వృద్ధురాలు తిండీ తిప్పలు లేకుండా తన కుమారుల కోసం ఎదురుచూస్తూ ఉన్న దృశ్యం చూపరులను కన్నీరు తెప్పిస్తుంది. గ్రామస్థులు వెళ్లి తల్లిని ఇంటికి తీసుకెళ్లండి అని చెప్పినా వారు స్థానికుల మాటలను పెడచెవిన పెడుతూ ఆ వృద్ధురాలిని తీసుకొచ్చుకునేందుకు నిరాకరించారు.
ఇదీ చదవండి: శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!