వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం పోలీస్స్టేషన్లో ప్రొఫెసర్ కాసింపై కేసు నమోదైంది. అయితే ఆ కేసు విషయంలో పీటీ వారెంట్పై చర్లపల్లి జైలు నుంచి వరంగల్ అర్బన్ జిల్లా కోర్టుకు తీసుకురాగా... కోర్టులో అస్వస్థతకు గురై సృహతప్పి పడిపోయాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రొఫెసర్ కాసింను చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సుమారు 3 గంటలపాటు బందోబస్తు మధ్య చికిత్స అందించారు.
కొంత కుదుటపడ్డాక ఆయనను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కేసు ఈనెల 25కు వాయిదా పడింది. ప్రొఫెసర్ కాసింకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
- ఇదీ చూడండి : మనిషి తలను కుక్క ఎత్తుకెళ్లింది