వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే నరేందర్. 24వ డివిజన్లో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి పాల్గొన్నారు.
స్థానిక కార్పొరేటర్తో పాటు తూర్పు నియోజకవర్గంలోని కార్పొరేటర్లు కూడా హాజరయ్యారు అనంతరం 200 మంది నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే చేతులమీదుగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ కార్పొరేటర్ శారద జోషి కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే నచ్చజెప్పడం వల్ల తన పదవికి రాజీనామా చేస్తానన్న మాటలను వెనక్కి తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి