ETV Bharat / state

తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడుతాం: వినయ్​భాస్కర్​

author img

By

Published : Mar 6, 2021, 3:39 PM IST

కాజీపేట్​ రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ఉద్యమం లాగా పోరాటం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. కేంద్రం నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్​లో నాయి బ్రాహ్మణులతో ఆయన సమావేశమయ్యారు.

mla, chief vip vinay bhaskar comments kazipet railway coach factory in warangal
తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడుతాం: వినయ్​భాస్కర్​

కేంద్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా కేంద్రం నిరుద్యోగులను మోసం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్​లోని క్యాంపు కార్యాలయంలో నాయి బ్రాహ్మణులతో సమావేశమయ్యారు.

రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా మోసం చేసిందని వ్యాఖ్యానించారు. కాజీపేట్​లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడితే పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాదిమందికి ఉపాధి కలుగుతుందని వినయ్​ భాస్కర్​ తెలిపారు.

ఇదీ చూడండి: కాసేపట్లో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

కేంద్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా కేంద్రం నిరుద్యోగులను మోసం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్​లోని క్యాంపు కార్యాలయంలో నాయి బ్రాహ్మణులతో సమావేశమయ్యారు.

రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా మోసం చేసిందని వ్యాఖ్యానించారు. కాజీపేట్​లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడితే పరోక్షంగా, ప్రత్యక్షంగా వేలాదిమందికి ఉపాధి కలుగుతుందని వినయ్​ భాస్కర్​ తెలిపారు.

ఇదీ చూడండి: కాసేపట్లో బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.