వరంగల్ అర్బన్ జిల్లా ఏకశిలానగర్లోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి నీళ్లు కావాలని అడిగాడు. ఈ క్రమంలో గృహిణి ఇంట్లోకి వెళ్లి నీళ్లు తీసుకువచ్చే సమయంలో ఇంట్లో ఎవరు లేరన్న విషయాన్ని గమనించాడు ఆ ఆగంతకుడు. వెంటనే ఒంటరిగా ఉన్న లక్ష్మీపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన మహిళ బిగ్గరగా అరిచింది. ఈ కేకలకు చుట్టు పక్కలవాళ్లు రావడం గమనించి అక్కడినుంచి దుండగుడు జారుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. దొంగతనం చేసేందుకే దుండగుడు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు.