ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి దేవాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు సాదాసీదాగా జరుగుతున్నాయి. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.
ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి భద్రీశ్వరుల కల్యాణాన్ని అర్చకులు ఏకాంతంగా జరిపారు. వేద మంత్రోచ్ఛారణుల నడుమ.. స్వామి వారు భద్రకాళి అమ్మవారికి మాంగల్యధారణ చేయగా.. మంగళవాద్యాల నడుమ అమ్మవారు స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.
ఇదీ చదవండి: సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి బహిరంగ లేఖ