ETV Bharat / state

MLA Etela Rajender: 'అసహనంతోనే బండి సంజయ్‌పై దాడి.. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులా.?'

హుజూరాబాద్(Huzurabad bypoll)​ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా.. అంతిమంగా ప్రజలు ధర్మాన్నే గెలిపించారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. నల్గొండలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై​ దాడిని ఈటల ఖండించారు. రైతులకు అన్యాయం జరగకుండా.. ప్రతి గింజా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్(Huzurabad MLA Etela Rajender)​ ​చేశారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా కేంద్రంలో ఈటల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

author img

By

Published : Nov 15, 2021, 1:52 PM IST

Updated : Nov 15, 2021, 4:36 PM IST

etela rajender
ఈటల రాజేందర్​

అసహనంతోనే నల్గొండలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(attack on bandi sanjay in nalgonda)పై.... తెరాస నేతలు దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender)​ ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు ఎంతమాత్రం సరికావన్నది ముఖ్యమంత్రి గ్రహించాలని హితవు పలికారు. ఇలాంటి దాడులెన్ని జరిగినా... భాజపా నేతలు, కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల(Huzurabad MLA Etela Rajender)​ .. సీఎం కేసీఆర్​ పాలనను ఎండగట్టారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపెడుతోందని.. తెరాస నేతల ఆరోపణలను ఈటల తోసిపుచ్చారు. ఏదైనా కేంద్రాన్ని అడిగేదాన్ని బట్టే ఉంటుందని అన్నారు. కేవలం ఓ బోర్డు పెట్టినంత మాత్రాన వైద్యకళాశాలలు మంజూరు చేయరని... వాటికి ప్రత్యేక విధి విధానాలుంటాయని తెలిపారు.

అసహనంతోనే బండి సంజయ్‌పై దాడి: ఈటల రాజేందర్

అసహనంతోనే తెరాస నేతలు.. నల్గొండలో బండి సంజయ్​పై దాడికి పాల్పడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు సరికాదు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇలాంటి దాడులెన్ని జరిగినా భాజపా నేతలు, కార్యకర్తలు భయపడరు. -ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ భాజపా ఎమ్మెల్యే

ముడి బియ్యం ఇవ్వండి

ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పడం లేదని.. ఉప్పుడు బియ్యానికి బదులుగా ముడి బియ్యం(paddy procurement in telangana) ఇవ్వమని చెబుతోందని ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender)​ ​అన్నారు. మొండి వైఖరికి పోకుండా.. రైతులకు అన్యాయం జరగకుండా ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాంకేతికత సాయంతో.. నూకలు రాకుండా ధాన్యాన్ని ఆడించే మిల్లులు అందుబాటులోకి తీసుకురావాలని ఈటల(Huzurabad MLA Etela Rajender)​ అన్నారు. వరి వేస్తే ఉరి అని బెదిరింపులకు పోకుండా.. వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు చేయాలని అభిప్రాయపడ్డారు. రాగులు, సజ్జలు, కొర్రలకు ప్రజల నుంచి డిమాండ్ ఉందని.. వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

బెదిరింపులకు పాల్పడ్డారు

దళిత బంధు అమలు చేయడానికి నిధులు లేకనే.. ఆ పథకాన్ని ఆపడానికి తనపై తప్పుడు కథనాలు సృష్టించారని ఈటల(Huzurabad MLA Etela Rajender)​ ఆరోపించారు. హుజూరాబాద్​ ఎన్నికల్లో(Huzurabad by election) తెరాసకు ఓటేయకపోతే పింఛను, సీఎం రిలీఫ్​ ఫండ్​ తదితర పథకాలు ఆగిపోతాయని బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. పసుపు, కుంకుమ ఇచ్చి.. ఓటర్లతో ప్రమాణం చేయించుకున్నారని దుయ్యబట్టారు.

పోలీసుల సాయంతో

హుజూరాబాద్​ ఉప ఎన్నికల కోసం సీఎం కేసీఆర్​.. వందల కోట్లు ఖర్చు పెట్టారు. పోలీసు అధికారుల సాయంతోనే ఎస్కార్టు వాహనాల్లో డబ్బులు పంచారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వారి కుటుంబ సభ్యుల ఓటర్ల జాబితా తీసుకున్నారు. పింఛను రాదని వృద్ధులను బెదిరించారు. ఇన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలిచింది. ఇకనైనా ప్రజల మీద మమకారంతో.. వారి సంక్షేమం గురించి ఆలోచించాలి. వరి కుప్పల మీద అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. భేషజాలకు పోకుండా రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలి. -ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ ఎమ్మెల్యే

చివరకు ధర్మమే గెలిచింది..

తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి.. సీఎం కేసీఆర్​ హుజూరాబాద్​ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచారని ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender)​ ​ ఆరోపించారు. ఎన్నిక(Huzurabad by election)ల్లో గెలవడం కోసం ప్రభుత్వ, కాంట్రాక్టు, గ్రామ స్థాయి ఉద్యోగులను ప్రచారంలో వినియోగించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వారి కుటుంబీకుల ఓట్లను కొనుక్కున్నారని దుయ్యబట్టారు. వినని వాళ్లను బదిలీ చేశారని ఆరోపించారు. దేశ చరిత్రలోనే పోలీసు ఎస్కార్టు వాహనాల్లో డబ్బులు పంపిణీ చేశారని విమర్శించారు. తెరాస ఎన్ని కుట్రలు పన్నినా.. హుజూరాబాద్​ ప్రజలు ధర్మానికే ఓటేశారని ఈటల స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Paddy cultivation requires: పంట మార్చితే బెటర్.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిఫార్సు

అసహనంతోనే నల్గొండలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌(attack on bandi sanjay in nalgonda)పై.... తెరాస నేతలు దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender)​ ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు ఎంతమాత్రం సరికావన్నది ముఖ్యమంత్రి గ్రహించాలని హితవు పలికారు. ఇలాంటి దాడులెన్ని జరిగినా... భాజపా నేతలు, కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల(Huzurabad MLA Etela Rajender)​ .. సీఎం కేసీఆర్​ పాలనను ఎండగట్టారు. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపెడుతోందని.. తెరాస నేతల ఆరోపణలను ఈటల తోసిపుచ్చారు. ఏదైనా కేంద్రాన్ని అడిగేదాన్ని బట్టే ఉంటుందని అన్నారు. కేవలం ఓ బోర్డు పెట్టినంత మాత్రాన వైద్యకళాశాలలు మంజూరు చేయరని... వాటికి ప్రత్యేక విధి విధానాలుంటాయని తెలిపారు.

అసహనంతోనే బండి సంజయ్‌పై దాడి: ఈటల రాజేందర్

అసహనంతోనే తెరాస నేతలు.. నల్గొండలో బండి సంజయ్​పై దాడికి పాల్పడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులు సరికాదు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇలాంటి దాడులెన్ని జరిగినా భాజపా నేతలు, కార్యకర్తలు భయపడరు. -ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ భాజపా ఎమ్మెల్యే

ముడి బియ్యం ఇవ్వండి

ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పడం లేదని.. ఉప్పుడు బియ్యానికి బదులుగా ముడి బియ్యం(paddy procurement in telangana) ఇవ్వమని చెబుతోందని ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender)​ ​అన్నారు. మొండి వైఖరికి పోకుండా.. రైతులకు అన్యాయం జరగకుండా ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాంకేతికత సాయంతో.. నూకలు రాకుండా ధాన్యాన్ని ఆడించే మిల్లులు అందుబాటులోకి తీసుకురావాలని ఈటల(Huzurabad MLA Etela Rajender)​ అన్నారు. వరి వేస్తే ఉరి అని బెదిరింపులకు పోకుండా.. వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు చేయాలని అభిప్రాయపడ్డారు. రాగులు, సజ్జలు, కొర్రలకు ప్రజల నుంచి డిమాండ్ ఉందని.. వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

బెదిరింపులకు పాల్పడ్డారు

దళిత బంధు అమలు చేయడానికి నిధులు లేకనే.. ఆ పథకాన్ని ఆపడానికి తనపై తప్పుడు కథనాలు సృష్టించారని ఈటల(Huzurabad MLA Etela Rajender)​ ఆరోపించారు. హుజూరాబాద్​ ఎన్నికల్లో(Huzurabad by election) తెరాసకు ఓటేయకపోతే పింఛను, సీఎం రిలీఫ్​ ఫండ్​ తదితర పథకాలు ఆగిపోతాయని బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. పసుపు, కుంకుమ ఇచ్చి.. ఓటర్లతో ప్రమాణం చేయించుకున్నారని దుయ్యబట్టారు.

పోలీసుల సాయంతో

హుజూరాబాద్​ ఉప ఎన్నికల కోసం సీఎం కేసీఆర్​.. వందల కోట్లు ఖర్చు పెట్టారు. పోలీసు అధికారుల సాయంతోనే ఎస్కార్టు వాహనాల్లో డబ్బులు పంచారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వారి కుటుంబ సభ్యుల ఓటర్ల జాబితా తీసుకున్నారు. పింఛను రాదని వృద్ధులను బెదిరించారు. ఇన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలిచింది. ఇకనైనా ప్రజల మీద మమకారంతో.. వారి సంక్షేమం గురించి ఆలోచించాలి. వరి కుప్పల మీద అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు. భేషజాలకు పోకుండా రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలి. -ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ ఎమ్మెల్యే

చివరకు ధర్మమే గెలిచింది..

తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి.. సీఎం కేసీఆర్​ హుజూరాబాద్​ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచారని ఈటల రాజేందర్(Huzurabad MLA Etela Rajender)​ ​ ఆరోపించారు. ఎన్నిక(Huzurabad by election)ల్లో గెలవడం కోసం ప్రభుత్వ, కాంట్రాక్టు, గ్రామ స్థాయి ఉద్యోగులను ప్రచారంలో వినియోగించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వారి కుటుంబీకుల ఓట్లను కొనుక్కున్నారని దుయ్యబట్టారు. వినని వాళ్లను బదిలీ చేశారని ఆరోపించారు. దేశ చరిత్రలోనే పోలీసు ఎస్కార్టు వాహనాల్లో డబ్బులు పంపిణీ చేశారని విమర్శించారు. తెరాస ఎన్ని కుట్రలు పన్నినా.. హుజూరాబాద్​ ప్రజలు ధర్మానికే ఓటేశారని ఈటల స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: Paddy cultivation requires: పంట మార్చితే బెటర్.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిఫార్సు

Last Updated : Nov 15, 2021, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.