ETV Bharat / state

జగన్మాత నామస్మరణతో మారుమోగిన భద్రకాళీ ఆలయం - undefined

దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లాలోని శ్రీ భద్రకాళీ ఆలయంలో అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు.

దసరా సందర్భంగా భద్రకాళీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : Oct 8, 2019, 12:58 PM IST

కాకతీయుల ఆరాధ్య దైవం ఓరుగల్లు శ్రీ భద్రకాళీ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవాల చివరి రోజు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వాహన పూజల కోసం ఆలయం ఎదుట వాహనాలు బారులు తీరాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం అమ్మవారిని భద్రకాళి తటాకంలో తెప్పపై ఊరేగించనున్నారు.

దసరా సందర్భంగా భద్రకాళీ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి : 'జమ్మి చెట్టు దగ్గర ఇలా చేస్తే... అన్నింట్లో విజయం మీ సొంతం

కాకతీయుల ఆరాధ్య దైవం ఓరుగల్లు శ్రీ భద్రకాళీ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవాల చివరి రోజు రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. పండుగ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వాహన పూజల కోసం ఆలయం ఎదుట వాహనాలు బారులు తీరాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం అమ్మవారిని భద్రకాళి తటాకంలో తెప్పపై ఊరేగించనున్నారు.

దసరా సందర్భంగా భద్రకాళీ ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి : 'జమ్మి చెట్టు దగ్గర ఇలా చేస్తే... అన్నింట్లో విజయం మీ సొంతం

TG_WGL_15_08_BHADRAKALI_AV_TS10076 B.PRASHANTH WARANGAL TOWN గమనిక : ఈ ఫైలుకు సంబంధించిన విజువల్ త్రీజి కిట్ నుంచి పంపించడం జరిగినది ( )కాకతీయుల ఆరాధ్య దైవం.. ఓరుగల్లు వాసులైన వేల్పు శ్రీ భద్రకాళీ దేవాలయం లో దేవీ నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవాల చివరి రోజు అమ్మవారు నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి కావడంతో ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. త్రి నగరి భక్తులతో పాటు ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వాహన పూజ ల కోసం వాహనాలు ఆలయం ఎదుట బారులు తీరాయి. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ప్రత్యేక క్యూలైన్లు లతోపాటు వికలాంగులకు వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయంలో లో నీటి వసతితో పాటు ఉచిత అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. సాయంత్రం అమ్మవారిని భద్రకాళి తటాకంలో తెప్పపై ఊరేగించానున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.