దిల్లీ అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా వరంగల్-ఖమ్మం ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
దిల్లీలో జరిగిన అల్లర్లను అదుపు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని నేతలు విమర్శించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని.. హోంశాఖ మంత్రి అమిత్షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీచూడండి: ఈ ఏడు మార్చి నుంచే భానుడి భగభగలు