ETV Bharat / state

టార్చిలైటు వెలుగులో ఆపరేషన్లు.. ఆదర్శం ఈ డాక్టరమ్మ - వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలు

ధన్వంతరి వారసులు... ధరణిలోన దేవతలు అని వైద్యుల గురించి అంటారు. పోయే ప్రాణాన్ని నిలబెట్టడం వల్లే....వారిని దైవంగా భావిస్తాం. లక్ష్మద్వీప్​కు చెందిన రెహమత్​ బేగం ఓ వైద్యురాలు. కనీస సౌకర్యాలు లేని తమ ప్రాంతంలో వైద్య సేవలందించి ఎంతో మంది బాలింతలను కాపాడారు. ఆవిడ సేవాభావానికి మెచ్చిన కేంద్ర ప్రభుత్వం 1999లో పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. వరంగల్​ కాకతీయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి అయిన ఆమె వజ్రోత్సవాల్లో భాగంగా హాజరయ్యారు.

పద్మశ్రీ రెహమత్​ బేగం
author img

By

Published : Jul 21, 2019, 3:54 PM IST

ఆదర్శవంతం... ఈ వైద్యురాలి జీవితం...

వైద్యో నారాయణ హరి అంటారు. అత్యవసర సమయంలో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. వరంగల్​ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి రెహమత్​బేగం లక్షద్వీప్​కు చెందినవారు. రవాణా సదుపాయం లేని ఆ ప్రాంతంలో ఎంతో మంది బాలింతల ప్రాణాలు కాపాడారు. ఆవిడ సేవలను గుర్తించిన కేంద్రం 1999లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. కాకతీయ వైద్య కళాశాల వజ్రోత్సవాలను పురస్కరించుకుని వరంగల్​ వచ్చిన ఆమెను మంత్రులు, ఇతర వైద్యులు ఘనంగా సన్మానించారు.

గణనీయ కృషి...

లక్షద్వీప్‌ ఆగాటి అనే చిన్న దీవిలో జన్మించిన రెహమత్ బేగం... విద్యాభ్యాసం కష్టాల్లో సాగింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి వైద్యవిద్యను పూర్తి చేశారు. కేరళలోని కాలికట్​లో ప్రీ డిగ్రీ పూర్తి చేసిన ఆమె 1963లో వరంగల్​ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్​ పట్టా అందుకున్నారు. గైనకాలజీలో పీజీ పూర్తి చేశాక తిరిగి స్వగ్రామం వెళ్లి అక్కడ దీవి ప్రాంతంలో వైద్య సేవలందించారు. విద్యుత్​, రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండడం వల్ల ఆ ప్రాంతంలో గర్భిణులు అధికంగా చనిపోయేవారు. రెహమత్​ బేగం వారికి అండగా నిలిచారు. టార్చిలైటు సాయంతోనే అనేక మందికి పురుడు పోసి... ప్రాణాలు నిలబెట్టారు. బాలింతల మరణాలు తగ్గించడంలో కృషి చేసినందుకు ఆమెను 1999లో పద్మశ్రీ వరించింది.

ఆత్మీయ పలకరింపు

వరంగల్​ వచ్చిన ఆమెను వైద్యులు, సన్నిహితులు అభినందించారు. మంత్రులు ఘనంగా సన్మానించారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

ఆనందంగా ఉంది...

చాలా ఏళ్ల తర్వాత ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని రెహమత్​ బేగం అన్నారు. తనకు జరిగిన సత్కారం, సన్నిహితుల ఆదరాభిమానాలు ఎన్నటికీ మరిచిపోలేనని తెలిపారు.

ఇదీ చూడండి : ఆర్థిక అభివృద్ధే కాదు... మానవసంబంధాలూ పరిపుష్టం

ఆదర్శవంతం... ఈ వైద్యురాలి జీవితం...

వైద్యో నారాయణ హరి అంటారు. అత్యవసర సమయంలో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడే వైద్యులను ప్రత్యక్ష దైవంగా భావిస్తాం. వరంగల్​ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి రెహమత్​బేగం లక్షద్వీప్​కు చెందినవారు. రవాణా సదుపాయం లేని ఆ ప్రాంతంలో ఎంతో మంది బాలింతల ప్రాణాలు కాపాడారు. ఆవిడ సేవలను గుర్తించిన కేంద్రం 1999లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది. కాకతీయ వైద్య కళాశాల వజ్రోత్సవాలను పురస్కరించుకుని వరంగల్​ వచ్చిన ఆమెను మంత్రులు, ఇతర వైద్యులు ఘనంగా సన్మానించారు.

గణనీయ కృషి...

లక్షద్వీప్‌ ఆగాటి అనే చిన్న దీవిలో జన్మించిన రెహమత్ బేగం... విద్యాభ్యాసం కష్టాల్లో సాగింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి వైద్యవిద్యను పూర్తి చేశారు. కేరళలోని కాలికట్​లో ప్రీ డిగ్రీ పూర్తి చేసిన ఆమె 1963లో వరంగల్​ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్​ పట్టా అందుకున్నారు. గైనకాలజీలో పీజీ పూర్తి చేశాక తిరిగి స్వగ్రామం వెళ్లి అక్కడ దీవి ప్రాంతంలో వైద్య సేవలందించారు. విద్యుత్​, రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండడం వల్ల ఆ ప్రాంతంలో గర్భిణులు అధికంగా చనిపోయేవారు. రెహమత్​ బేగం వారికి అండగా నిలిచారు. టార్చిలైటు సాయంతోనే అనేక మందికి పురుడు పోసి... ప్రాణాలు నిలబెట్టారు. బాలింతల మరణాలు తగ్గించడంలో కృషి చేసినందుకు ఆమెను 1999లో పద్మశ్రీ వరించింది.

ఆత్మీయ పలకరింపు

వరంగల్​ వచ్చిన ఆమెను వైద్యులు, సన్నిహితులు అభినందించారు. మంత్రులు ఘనంగా సన్మానించారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

ఆనందంగా ఉంది...

చాలా ఏళ్ల తర్వాత ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని రెహమత్​ బేగం అన్నారు. తనకు జరిగిన సత్కారం, సన్నిహితుల ఆదరాభిమానాలు ఎన్నటికీ మరిచిపోలేనని తెలిపారు.

ఇదీ చూడండి : ఆర్థిక అభివృద్ధే కాదు... మానవసంబంధాలూ పరిపుష్టం

Intro:ఆసిఫ్ నగర్ ని సందర్శించిన కిషన్ రెడ్డి


Body:ఆసిఫ్ నగర్ ని సందర్శించిన కిషన్ రెడ్డి


Conclusion:హైదరాబాద్:ఆసిఫ్ నగర్ ని సందర్శించిన కిషన్ రెడ్డి..
నోట్: పూర్తి స్క్రిప్ట్ ఎఫ్.టి.పి ద్వారా పంపబడింది గమనించగలరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.