ETV Bharat / state

డిపో ముందు బైఠాయించి.. తాత్కాలిక సిబ్బంది అడ్డగింత - tsrtc employees strike at parakala latest

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో 41వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నాలుగు గంటల పాటు డిపో ముందు బైఠాయించి తాత్కాలిక సిబ్బంది విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.

డిపో ముందు బైఠాయించి.. తాత్కాలిక సిబ్బంది అడ్డగింత
author img

By

Published : Nov 14, 2019, 11:00 AM IST

రాష్ట్రవ్యాప్తంగా 41వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో ఆందోళనలు, నిరసనలతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరకాల డిపో ముందు నాలుగు గంటలపాటు బైఠాయించారు. తాత్కాలిక సిబ్బందిని విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

డిపో ముందు బైఠాయించి.. తాత్కాలిక సిబ్బంది అడ్డగింత

ఇదీ చదవండిః తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా 41వ రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో ఆందోళనలు, నిరసనలతో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పరకాల డిపో ముందు నాలుగు గంటలపాటు బైఠాయించారు. తాత్కాలిక సిబ్బందిని విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

డిపో ముందు బైఠాయించి.. తాత్కాలిక సిబ్బంది అడ్డగింత

ఇదీ చదవండిః తాగి రెచ్చిపోయిన గల్లీ లీడర్లు.. జై కొట్టిన పోలీసులు

Intro:TG_wgl_41_14_rtc_samme_av_ts10074 cantributer kranthi parakala వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటాన్ని ఉధృతం చేశారు. దాదాపు మూడున్నర గంటలకు ఆర్టీసీ డిపో పరిసరాలకు చేరుకున్న ఆర్టీసీ కార్మికులు గ్రూపుల వారీగా చేరుకొని, తాత్కాలిక కార్మికులను విధులు నిర్వహించకుండా అక్కడున్నరూ. వారిని ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. దానితో తాత్కాలిక కార్మికులు చేసేది ఏమీ లేక వెనక్కి తిరి గి వెళ్లిపోయారు. దాదాపు ఆరు గంటల వరకు ఆర్టీసీ డిపో వద్ద హైడ్రామా నెలకొంది .ఆ తర్వాతపోలీస్ లు రంగ ప్రవేశం చేసిన పోలీసులు తాత్కాలికంగా నాలుగు బస్సులను బయటికి పంపే ప్రయత్నం చేశారు. అప్పటికే బస్సులు నడిపే తాత్కాలిక ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో బస్సులు కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. తదనంతరం ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ గేటు వద్ద బైఠాయించి తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలతో హోరెత్తించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజల కోసమే తాము ఉద్యమం చేస్తున్నామని రెండు నెలల నుంచి జీతాలు లేకుండా ఒక పూట తింటు ఆత్మగౌరవం కోసం మాత్రమే ఆర్టీసీ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నామని అన్నారు. దాదాపు పదివేల ఖాళీలు ఆర్టీసీ లో ఉన్న ఇప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో నిరుద్యోగులతో నింప వలసి ఉండగా ఒక్క ఉద్యోగం కూడా జారీ చేయలేదని నిరుద్యోగులు విషయాన్ని గమనించాలని, ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నించడంతో ఉద్యమాన్ని చేపడుతున్నామని ప్రజలు ఈ విషయం గుర్తించాలని అని చేతులు జోడించి నమస్కరించి తమకు సహకరించాలని కోరారు అలాగే కార్మికులు గేటు వద్ద ధర్నా చేస్తూ ఉండడంతో పోలీసులు వారిని ముందస్తుగా అదుపులోకి తీసుకొని ఆర్టీసీ బస్సులను ప్రజా రవాణా కోసం బయటకు పంపించారు బైట్1) రాంబాబు( rtcజిల్లా నాయకులు )


Body:TG_wgl_41_14_rtc_samme_av_ts10074


Conclusion:TG_wgl_41_14_rtc_samme_av_ts10074
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.