ETV Bharat / state

మొక్కను తిన్న మేక... యజమానికి రూ. 37వేల జరిమానా

హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను మేకలు తిన్నాయని సదరు యజమానికి రూ. 37,500/- జరిమానా విధించిన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది.

author img

By

Published : Sep 3, 2019, 11:34 PM IST

యజమానికి రూ. 37వేల జరిమానా

హరితహారంలో నాటిన మొక్కలను మేకలు తిన్నాయని సదరు యజమానికి జరిమానా విధించిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఇల్లందలో చోటుచేసుకుంది. గత నెల 19న జిల్లా కలెక్టర్ హరిత, కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ చేతుల మీదగా హరితహారంలో భాగంగా ఇల్లందలోని హనుమాన్ దేవాలయం వద్ద మొక్కలు నాటారు. సెప్టెంబర్ 2న ఇదే గ్రామానికి చెందిన దుస్సా లింగయ్యకు చెందిన మేకలు.. 150 మొక్కలను తిన్నాయని విచారణ చేపట్టి పరిహారం కింద రూ. 37,500/- జరిమానా విధించారు. 15 రోజుల్లో జరిమానా కట్టకపోతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేశారు.

హరితహారంలో నాటిన మొక్కలను మేకలు తిన్నాయని సదరు యజమానికి జరిమానా విధించిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఇల్లందలో చోటుచేసుకుంది. గత నెల 19న జిల్లా కలెక్టర్ హరిత, కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ చేతుల మీదగా హరితహారంలో భాగంగా ఇల్లందలోని హనుమాన్ దేవాలయం వద్ద మొక్కలు నాటారు. సెప్టెంబర్ 2న ఇదే గ్రామానికి చెందిన దుస్సా లింగయ్యకు చెందిన మేకలు.. 150 మొక్కలను తిన్నాయని విచారణ చేపట్టి పరిహారం కింద రూ. 37,500/- జరిమానా విధించారు. 15 రోజుల్లో జరిమానా కట్టకపోతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులు జారీ చేశారు.

యజమానికి రూ. 37వేల జరిమానా

ఇదీ చూడండి: పంచాయతీరాజ్​శాఖపై సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సదస్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.