ETV Bharat / state

వరంగల్​ గ్రామీణ జిల్లాలో మినీడైరీ ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్యే ధర్మారెడ్డి

author img

By

Published : Aug 15, 2020, 6:47 PM IST

దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసమే కేసీఆర్​ పలు పథకాలు ప్రవేశ పెడుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మినీ డైరీ పైలెట్ ప్రాజెక్టు కోసం వరంగల్ రూరల్ జిల్లాను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్​తో కలిసి రూ.7 కోట్ల విలువ చేసే చెక్కులు పంపిణీ చేశారు.

Parakala MLA Distributes Cheques In Warangal Collector Office
వరంగల్​ గ్రామీణ జిల్లాలో మినీడైరీ ఏర్పాటు చేస్తాం : ఎమ్మెల్యే ధర్మారెడ్డి

వరంగల్​ గ్రామీణ జిల్లా కలెక్టరేట్​ ఆవరణలో జిల్లా షెడ్యూల్​ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ.7కోట్ల విలువ చేసే చెక్కులు అందజేశారు. పాడిగేదెల పంపిణీ పథకం ద్వారా జిల్లా కలెక్టర్​ హరితతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. వరంగల్​ గ్రామీణ జిల్లాలో పైలట్​ ప్రాజెక్టు కింద మినీ డైరీ ఏర్పాటు చేయనున్నామని, నిరుపేద ఎస్సీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.

పైలట్​ ప్రాజెక్టు విజయవంతం అయితే.. ఇతర జిల్లాల్లో కూడా ఈ పథకం ప్రవేశపెట్టే ఆలోచనపో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. మరో 10 రోజుల్లో లబ్ధిదారులకు మినీ డైరీ గేదలను అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీఎం సత్యజిత్​, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, ఆత్మకూర్ జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, దామెర జడ్పీటీసీ గరిగె కల్పనాకృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్​ గ్రామీణ జిల్లా కలెక్టరేట్​ ఆవరణలో జిల్లా షెడ్యూల్​ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రూ.7కోట్ల విలువ చేసే చెక్కులు అందజేశారు. పాడిగేదెల పంపిణీ పథకం ద్వారా జిల్లా కలెక్టర్​ హరితతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. వరంగల్​ గ్రామీణ జిల్లాలో పైలట్​ ప్రాజెక్టు కింద మినీ డైరీ ఏర్పాటు చేయనున్నామని, నిరుపేద ఎస్సీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.

పైలట్​ ప్రాజెక్టు విజయవంతం అయితే.. ఇతర జిల్లాల్లో కూడా ఈ పథకం ప్రవేశపెట్టే ఆలోచనపో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. మరో 10 రోజుల్లో లబ్ధిదారులకు మినీ డైరీ గేదలను అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీఎం సత్యజిత్​, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్, ఆత్మకూర్ జడ్పీటీసీ కక్కెర్ల రాధికారాజు, దామెర జడ్పీటీసీ గరిగె కల్పనాకృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.