ETV Bharat / state

త్వరలోనే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం: ఈటల

author img

By

Published : Apr 26, 2021, 2:30 PM IST

పేదలకు రూపాయి ఖర్చులేకుండా వైద్యం అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వెల్లడించారు.

minister-etela-rajender-campaign-at-warangal-municipal-election
త్వరలోనే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం: ఈటల

త్వరలోనే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించే ప్రయత్నం... తెరాస ప్రభుత్వం చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హసన్​పర్తి మండలం దేవన్నపేటలోని 65వ డివిజన్​లో తెరాస అభ్యర్థి గుగులోతు దివ్య తరఫున ప్రచారం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని మంత్రి ఈటల తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కదిలిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

మరికొన్ని నెలల్లో వరంగల్​లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: ఆరునెలల్లో కాకతీయ టెక్స్​టైల్ పార్కులో ఉద్యోగాలు: ఎర్రబెల్లి

త్వరలోనే పేదలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించే ప్రయత్నం... తెరాస ప్రభుత్వం చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హసన్​పర్తి మండలం దేవన్నపేటలోని 65వ డివిజన్​లో తెరాస అభ్యర్థి గుగులోతు దివ్య తరఫున ప్రచారం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని మంత్రి ఈటల తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కదిలిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

మరికొన్ని నెలల్లో వరంగల్​లో అత్యాధునిక వైద్య సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: ఆరునెలల్లో కాకతీయ టెక్స్​టైల్ పార్కులో ఉద్యోగాలు: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.