కరోనా నేపథ్యంలో జరుగుతున్న లాక్డౌన్ వల్ల పూటగడవని నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందిస్తూ వరంగల్ రూరల్ జిల్లాలోని ఇల్లందు గ్రామ ఉద్యోగస్థులు ఆదర్శనంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై సరుకులను పంపిణీ చేశారు.
సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉద్యోగస్థులకు ఏసీపీ రమేశ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం ఇదే గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సైతం పేదలకు నిత్యవసర సరుకులు అందించారు.
ఇదీ చూడండి: ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు